అత్యాచారాలతో అట్టుడికిపోతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణమైన సంఘటన చేసుకుంది. కాన్పూర్ జిల్లాలో దళిత యువతిపై గ్రామ పెద్దతో పాటు మరో వ్యక్తి సామూహిక అత్యాాచారం చేశారు.
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. తూపాకి గురిపెట్టి ఓ దళిత మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఇద్దరిలో గ్రామ పెద్ద కూడా ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఆ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం జరిగిన ఆ సంఘటన గురించి పోలీసులకు ఆదివారంనాడు సమాచారం ఇచ్చారు. బాధితురాలి తల్లిదండ్రులు ఆ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి బలవంతంగా చొరబడి ఒంటరిగా ఉన్న 11 ఏళ్ల యువతిపై తుపాకి గురిపెట్టి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. సంఘటన గురించి ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు
సంఘటనపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.
హథ్రాస్ ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.