* వండిన మాంసం – 24 గంటల్లోనే వినియోగించాలి.
* ఉడికిన బ్రెడ్ – తేమ ద్వారా ఫంగస్ వేగంగా ఏర్పడుతుంది.
* ఉడికిన బిర్యానీ/కూరలు – రెండు రోజులకు మించకూడదు.
* ఆకుకూరలు – ఎక్కువ రోజులు నిల్వ చేస్తే పోషకాలు నాశనం అవుతాయి.
* పండిన అరటి పండ్లు – ఫ్రిజ్ ఉష్ణోగ్రతలో బ్లాక్గా మారిపోతాయి.
* బట్టర్ మిల్క్, పెరుగు – ఆమ్లత్వం పెరిగి ఆమ్ల దాహం, పేగు సమస్యలకు దారితీస్తుంది.
ఫుడ్ పాయిజన్ లక్షణాలు, ముందస్తు జాగ్రత్తలు
ఫుడ్ పాయిజన్ అయిన ఆహారాన్ని తీసుకున్న వెంటనే వాంతులు, విరేచనాలతోపాటు అధిక జ్వరం, కడుపు నొప్పి, నీరసం, మూర్ఛ, తలనొప్పి, ఊబకాయం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఒకవేళ ఫ్రిజ్లో ఉంచిన మాంసాన్ని మళ్లీ తినాలంటే మాంసాన్ని మళ్లీ వాడేముందు పూర్తిగా వేడి చేయాలి. ఫ్రిజ్ ఉష్ణోగ్రత 4°C (40°F) కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మాంసం రంగు, వాసనను పరీక్షించాలి.