సామాన్యులపై మరో ఎదురుదెబ్బ.. ప్లాన్‌ల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్న టెలికాం కంపెనీలు..

First Published Dec 6, 2021, 12:31 PM IST

తాజాగా టెలికాం(telecom) కంపెనీలు ప్రీ-పెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచుతూ సామాన్యులకు మొబైల్ రిచార్జ్(mobile recharge) మరింత ఖరీదైనదిగా చేసింది. అయితే సామాన్యుడిపై రిచార్జ్ భారం పెంచిన తర్వాత టెలికాం కంపెనీలు ఇప్పుడు మరో ఎదురుదెబ్బకు సిద్ధమవుతున్నాయి. అవును.. ఒక నివేదిక ప్రకారం టెలికాం కంపెనీలు ఇప్పుడు పోస్ట్‌పెయిడ్(postpaid) ప్లాన్‌ల ధరను పెంచే ఆలోచనలో ఉన్నాయి. 

 ఒకవేళ ఇలా జరిగితే ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సేవలను వినియోగించుకుంటున్న పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు మరో ఆర్ధిక భారంపెరుగుతుందని భావిస్తున్నారు. 

జియోతో సహా
దేశీయ ప్రముఖ టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా గత నెలలో ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్‌లో పెంచినట్లు ఎయిర్‌టెల్ గతంలో  గుర్తించింది. అయితే ఈ పెంపు  భారతీ ఎయిర్‌టెల్‌తో ప్రారంభమైంది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ మొబైల్ రిచార్జ్ ధరలను 20 నుండి 25 శాతం పెంచింది, మరోవైపు వోడాఫోన్ ఐడియా కూడా టారిఫ్‌ ప్లాన్ల ధరలను 25 శాతం పెంచింది.  ఈ రెండు టెలికాం కంపెనీల తర్వాత, రిలయన్స్ జియో కూడా అందులో చేరింది, దీంతో జియో ప్రీపెయిడ్ ప్లాన్ ధరలను 20 శాతం పెంచారు. 

ఇప్పటి వరకు
ఈ టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్లను పెంచిన తర్వాత పోస్ట్‌పెయిడ్ ధరల్లో ఎటువంటి మార్పు చేయలేదు. అయితే, నివేదిక ప్రకారం పోస్ట్‌పెయిడ్ వినియోగదారులపై కూడా భారం పెంచడానికి టెలికాం కంపెనీలు సన్నాహాలు ప్రారంభించాయి. మంచి విషయం ఏంటంటే పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లకు ధరల పెంపులో వ్యత్యాసం స్వల్పంగానే ఉండనుంది. పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు సాధారణంగా వారి ప్లాన్‌ను కొనసాగించడమే దీనికి కారణం.  
 

 నిపుణుల అభిప్రాయం ఏమిటి 
పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరల పెంపునకు సంబంధించి విడుదల చేసిన నివేదికలో టెలికాం కంపెనీలు ఆవరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ARPU)ను పెంచుకోవాలనుకుంటున్నాయనే వాస్తవాన్ని నిపుణులు పేర్కొంటున్నారు. వోడాఫోన్-ఐడియాకు ప్రస్తుతం ఇది చాలా అవసరం. ప్రీపెయిడ్ టారిఫ్ పెంపు కంపెనీలకు సహాయపడగా, పోస్ట్‌పెయిడ్ టారిఫ్ పెంపు కేక్‌పై చెర్రీలా పనిచేస్తుంది.

రెవెన్యూ మార్కెట్ రూ.22 వేల కోట్లు
రిపోర్టు ప్రకారం పోస్ట్ పెయిడ్ మార్కెట్ రెవెన్యూ పరంగా చూస్తే దాదాపు రూ.22,000 కోట్లు. పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు మొత్తం టెలికాం సెక్టార్‌లోని యాక్టివ్ సబ్‌స్క్రైబర్‌లలో 5 శాతం మంది ఉన్నారు అలాగే కంపెనీల ఆదాయంలో 15 శాతం పోస్ట్‌పెయిడ్ సెగ్మెంట్ నుండి వస్తుంది. 

click me!