కోహ్లీ.... రోహిత్ శర్మ ఎక్కడ..?

First Published Aug 2, 2019, 12:12 PM IST

గత కొద్ది రోజులుగా.. కోహ్లీ, రోహిత్ శర్మ ల మధ్య విభేదాలు నడుస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే విరాట్ కోహ్లీ స్పందించాడు. అవన్నీ వట్టి రూమర్స్ అని... అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టిస్తారు అని ప్రశ్నించారు.

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య ఏదో నడుస్తోంది అన్నది మాత్రం అందరికీ అర్థమౌతోంది. దీనిపై ఎవరు ఏం చెప్పినా... వారి ప్రవర్తన మాత్రం విభేదాలు నిజమనేలానే ఉన్నాయి. తాజాగా... కోహ్లీ పెట్టిన పోస్టు మరిన్ని ప్రశ్నలకు తావిస్తోంది.
undefined
ఇంతకీ మ్యాటరేంటంటే... గత కొద్ది రోజులుగా.. కోహ్లీ, రోహిత్ శర్మ ల మధ్య విభేదాలు నడుస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే విరాట్ కోహ్లీ స్పందించాడు. అవన్నీ వట్టి రూమర్స్ అని... అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టిస్తారు అని ప్రశ్నించారు.
undefined
దీనిపై టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి కూడా స్పందించారు. ‘ జట్టులో ఆటకన్నా ఎవరు గొప్పకాదు. అది కెప్టెన్ విరాట్ అయినా, నేనైనా.. ఇంకెవరైనా. అందరం జట్టు కోసం ఆలోచించేవాళ్లమే. జట్టులో విభేదాలుంటే అన్ని ఫార్మాట్లలో ఇంత నిలకడగా.. ఇన్ని సంవత్సరాలు జట్టు రాణించేది కాదు. డ్రెస్సింగ్ రూంలోని ఓ వ్యక్తిగా చెబుతున్నా జట్టులో ఎలాంటి విభేదాలు లేవు’ అని రవిశాస్త్రి పేర్కొన్నారు.
undefined
అయితే... రవిశాస్త్రి చెప్పిన ‘‘ అందరూ జట్టు కోసమే ఆలోచిస్తారు’’ అన్న కామెంట్స్ కి వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పరోక్షంగా స్పందించాడు. ‘‘ తాను జట్టు కోసం కాదు... దేశం కోసం ఆడతాను’’ అంటూ పోస్టు పెట్టి.. తాను బ్యాట్ పట్టుకొని మైదానంలోకి అడుగుపెడుతున్న ఫోటోని ఒకదానిని పోస్టు చేశాడు.
undefined
రవిశాస్త్రి కామెంట్స్ కి రోహిత్ శర్మ ఇచ్చిన సమాధానం పలు అనుమానాలకు దారి తీసింది. ఈ విషయం పక్కన పెడితే... తాజాగా... కోహ్లీ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. టీం ఇండియా సభ్యులతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశాడు. అందులో అందరూ బ్లూ కలర్ జెర్సీ వేసుకొని చాలా ఆనందంగా కనిపించారు.
undefined
అయితే... ఆ ఫోటోలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కనిపించకపోవడం గమనార్హం. రోహిత్ శర్మ లేకుండా మిగిలిన జట్టుతో కలిసి దిగిన ఫోటోని కోహ్లీ షేర్ చేశాడు. దీనిని గమనించిన అభిమానులు మాత్రం కోహ్లీని వదలడం లేదు. కోహ్లీ బాయ్... రోహిత్ శర్మ ఎక్కడ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు.
undefined
జట్లులో అందరూ ఉండి... కేవలం రోహత్ శర్మ లేకపోవడం వీరి మధ్య విభేదాలు ఉన్నాయనే పుకారుకి బలం తీసుకువస్తోంది. జట్టులో సభ్యుల మధ్య సమన్వయం లేకుంటే.. వెస్టిండీస్ తో జరిగే సిరీస్ ఎలా గెలుస్తారంటూ అభిమానులు ప్రశ్నలు వేస్తున్నారు. మరి దీనిపై కోహ్లీ ఎలా స్పందిస్తాడో చూడాలి.
undefined
click me!