లక్షద్వీప్ లో కొత్త చట్టాలు : ఏం చెబుతున్నాయి? వివాదాస్పదం ఎందుకవుతున్నాయి?

First Published Jun 1, 2021, 11:25 AM IST

దేశంలోనే అత్యంత సుందరమైన ప్రదేశాల్లో లక్షద్వీప్ ఒకటి.  ఈ 37 దీవుల సముదాయం లో కేవలం పరిధిలోని ప్రజలు నివసిస్తుంటారు.  ప్రకృతి అందాలకు, బీసీలకు పేరెన్నికగన్న కేంద్రపాలిత ప్రాంతం ఇప్పుడు నిరసనలతో  అట్టుడికిపోతుంది. ప్రశాంతతను కోల్పోయింది.

దేశంలోనే అత్యంత సుందరమైన ప్రదేశాల్లో లక్షద్వీప్ ఒకటి. ఈ 37 దీవుల సముదాయం లో కేవలం పరిధిలోని ప్రజలు నివసిస్తుంటారు. ప్రకృతి అందాలకు, బీసీలకు పేరెన్నికగన్న కేంద్రపాలిత ప్రాంతం ఇప్పుడు నిరసనలతో అట్టుడికిపోతుంది. ప్రశాంతతను కోల్పోయింది.
undefined
ఎందుకిలా జరిగింది? దీనికి కారకులెవరు? వినిపించే పేరు ప్రఫుల్ కే పటేల్. ఆయనని లక్షద్వీప్ నూతన అడ్మినిస్ట్రేటర్ గా గతేడాది డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం నియమించింది.ఈ పదవి స్వీకరించిన వెంటనే ఆయన జనవరిలో కొన్ని చట్టాలు చేయడానికి ప్రతిపాదనలు చేశారు. ఆయన చేసిన ప్రతిపాదనలన్నీ నీ ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయంటూ ప్రజలు దుయ్యబట్టారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడచిన వారం రోజులుగా లక్షద్వీప్ లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
undefined
ఇటీవలి కాలంలో లక్షద్వీప్ ప్రజల ఆగ్రహ జ్వాలలకు అనుకోని విధంగా మద్దతు లభించింది. మలయాళీ హీరోలు, సెలబ్రిటీలు, చివరకు కేరళ ప్రభుత్వం కూడా లక్షద్వీప్ కు అండగా నిలిచింది. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కూడా లక్షద్వీప్ ప్రజలకు అండగా నిలబడి ప్రఫుల్ పటేల్నో వెనక్కి పిలవాలని సాక్షాత్తు రాష్ట్రపతికి లేఖలు రాశారు.దీంతో ‘సేవ్ లక్షద్వీప్’ క్యాంపెయిన్ ఊపందుకుంది. ఇంతకీ ప్రఫుల్ చేసిన ప్రతిపాదనల్లో ఏముంది? ఎందుకు ప్రజలు అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు?
undefined
గూండా చట్టం : లక్షద్వీప్ లో ప్రఫుల్ చేసిన ప్రతిపాదనల్లో యాంటీ సోషల్ యాక్టివిటీస్ రెగ్యులేషన్ బిల్- 2021 ఒకటి. దీన్ని గూండా చట్టం అని కూడా పిలుస్తారు. దీని ప్రకారం ఎవరిపైనైనా అనుమానం వస్తే పోలీసులు సదరు వ్యక్తిని ఏడాదిపాటు అరెస్ట్ చేసి జైల్లో ఉంచొచ్చు.
undefined
అయితే లక్షద్వీప్ లో క్రైమ్ రేటు చాలా తక్కువ. అలాంటి చోట ఇలాంటి కఠినమైన చట్టాలు ఎందుకు? అనేది ప్రజల వాదన. ఇక్కడ జనాభాలో 90 శాతం ముస్లింలు. అందుకే ఇలాంటి చట్టం చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి.
undefined
ఆస్తులను స్వాధీనం చేసుకునే హక్కు : మరో వివాదాస్పద ప్రతిపాదన లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ - 2021. దీని ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు, టౌన్ ప్లానింగ్ కోసం దీవుల్లోని ప్రజల నుంచి వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం అడ్మినిస్ట్రేటర్ కు ఉంటుంది. లక్షద్వీప్ అభివృద్ధి కోసమే ఈ తరహా చట్టం చేస్తున్నామని అడ్మినిస్ట్రేటర్ చెప్పుకొస్తున్నారు.
undefined
కానీ ఈ చట్టం కూడా చాలా వివాదాస్పదమైంది. మితిమీరిన అభివృద్ధి, భవన నిర్మాణాల వల్ల దీవుల సహజ సౌందర్యం కూడా దెబ్బతింటుందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వారి స్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధి, పర్యాటక ప్రాజెక్టులు దీవుల పరిరక్షణ సమతుల్యతను దెబ్బతీసే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
undefined
మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ : దీవుల్లో మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చారు ప్రఫుల్. ఇప్పటివరకు కేవలం ఒక్క దీవి లో నే మద్యం అమ్మకం జరిగేవి. అయితే ప్రఫుల్ తాజా ప్రతిపాదనతో అన్ని దీవుల్లోని రిసార్టుల్లో మద్యం అమ్ముకోవచ్చు.
undefined
లక్షద్వీప్ లో 90% పైగా ముస్లింలు ఉంటారు. వాస్తవానికి ఇక్కడ ఆల్కహాల్ కు అనుమతి ఉండదు. అలాంటిది, ఏకంగా మద్యం అమ్మకాలు మొదలు పెట్టాలి అనడం ప్రజాగ్రహానికి దారితీసింది. మద్యం నిషేధానికి ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోయి, మద్యం అమ్మకాలను మొదలుపెడతామని అనడం ఎంతవరకు సమంజసం ఇక్కడి ప్రజలు వాపోతున్నారు.
undefined
అధిక సంతానం ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులు : ప్రొఫైల్ ప్రతిపాదించిన పంచాయతీరాజ్ మార్గదర్శకాల ప్రకారం, ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉన్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఇప్పటికే ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు. ఇకపై పిల్లలను కనకపోతే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.
undefined
లక్షద్వీప్ లో ముస్లిం జనాభా అధికం. ముస్లింలలో సంతానం కూడా అధికంగానే ఉంటుంది. దీంతో వీరిని టార్గెట్ చేసి ఈ చట్టం చేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో వివాదం మరింత తీవ్రమైంది.
undefined
మాంసాహారం అమ్మకాలపై ఆంక్షలు : గోవులు, ఎద్దులు, బర్రెలు, గొర్రెలు, దున్నపోతులు.. ఇలా జంతువులను వధించడం, వాటి మాంసం అమ్మదాన్ని నిషేధించడం ప్రఫుల్ చేసిన మరో ప్రతిపాదన. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇది సాధ్యమా? వారికి బీఫ్ బాగా అలవాటు. గోవధపై నిషేధం వరకు సరే కానీ, మిగతా జంతువలపైనా నిషేధం విధిస్తే ఎలా? అనేది మెజార్టీ మంచి వాదన. ముస్లింలు కాకుండా ఈ దీవుల్లో ఉండే ఆదివాసీలు కూడా ఎక్కువగా మాంసంపైపే ఆధారపడతారు.
undefined
వారు ఈ కొత్త ప్రతిపాదన రుచించడం లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో బీఫ్ అమ్మకాల గురించి ఎవరూ మాట్లాడరు. మొన్నటి ఎన్నికల్లో అస్సాం, కేరళ రాష్ట్రాల్లో కూడా బీఫ్ అమ్మకాలు గురించి ఏ నేతా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు లక్షద్వీప్ లో మాత్రం ఆహారంపై ఆంక్షలు విధిస్తున్నారు. ఇదేంటని అడిగితే పాలిచ్చే జంతువుల్ని రక్షించడం కోసమే ఈ చట్టం అని సమాధానమిచ్చినా ఆ వానలో పస కనిపించడం లేదు. ఈ నిర్ణయం తమ స్వేచ్ఛకు, ఆహారపు అలవాట్లకు భంగం కలిగించేదిగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. కనీసం స్తానిక సంస్థలతోనైనా సంప్రదించలేదని ఆరోపిస్తున్నారు.
undefined
click me!