PM Modi: త‌న త‌ల్లిని దూషించిన వారిపై మోదీ రియాక్ష‌న్‌.. ఆలోజింప‌చేస్తున్న ప్ర‌ధాని మాట‌లు

Published : Aug 01, 2026, 02:37 PM IST

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనపై, తన దివంగత తల్లిపై విద్యార్థుల నిరసనలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని క్షమిస్తున్నట్లు ప్రకటించారు. తప్పు చేసిన యువతను శిక్షించడం కంటే వారికి సరైన మార్గనిర్దేశం చేయడం సమాజ బాధ్యత అని ఆయన అన్నారు.

PREV
15
'నిరసన హక్కు ఉంది.. కానీ భాషకు హద్దులు ఉండాలి'

జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనను దేశం మొత్తం గమనించిందని ప్రధాని మోదీ చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందని పేర్కొన్న ఆయన, అయితే ఆ సందర్భంగా ఉపయోగించిన కొన్ని పదజాలం నాగరిక సమాజంలో అంగీకరించదగినది కాదన్నారు. తనతో పాటు తన దివంగత తల్లిని కూడా అవమానించేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు.

25
'వారు దారి తప్పిన పిల్లలు.. కోపంతో సమస్యలు పరిష్కారం కావు'

ఈ ఘటనపై ప్రతీకారం లేదా ఆగ్రహంతో స్పందించడం సరైన మార్గం కాదని ప్రధాని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలు చేసిన విద్యార్థులను దారి తప్పిన పిల్లలుగా తాను భావిస్తున్నానని చెప్పారు. అలాంటి వారిని కోర్టుల చుట్టూ తిప్పడం, కఠిన చర్యలు తీసుకోవడం లేదా సమాజంలో అవమానించడం వల్ల సమస్య పరిష్కారం కాదని అన్నారు. వారిలో మార్పు తీసుకురావడమే అసలు లక్ష్యంగా ఉండాలని సూచించారు.

35
'నాలుక, పళ్ల' ఉపమానంతో వివరించిన ప్రధాని

తన అభిప్రాయాన్ని వివరించేందుకు ప్రధాని మోదీ ఒక ఉదాహరణ చెప్పారు. కొన్నిసార్లు పొరపాటున నాలుక పళ్ల కింద పడితే గాయమవుతుంది, కానీ అందుకని ఎవరూ పళ్లను విరగ్గొట్టరని అన్నారు. ఎందుకంటే పళ్లు, నాలుక రెండూ మన శరీరంలోని భాగాలేనని వివరించారు. అదే విధంగా యువత కూడా సమాజంలో భాగమేనని, వారు తప్పు చేసినప్పుడు వారిని దూరం చేయడం కాదు, సరిదిద్దే ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు.

45
'దేశ నిర్మాణంలో యువత ముందుండాలి'

విద్యార్థులు జరిగిన ఘటనను పాఠంగా తీసుకుని భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కొత్త విషయాలు నేర్చుకోవాలని, చేసిన తప్పుల నుంచి అనుభవం పొందాలని సూచించారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, ప్రతి యువకుడు భారత పురోగతిలో భాగస్వామి కావాలని ఆకాంక్షించారు. "నేను మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాను. మనమంతా కలిసి దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిద్దాం" అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.

55
క్షమాభావంతో ముందుకు సాగాలని పిలుపు

సమాజంలో విభేదాలు, ఆవేశం కంటే పరస్పర అవగాహన, క్షమాభావం ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. తప్పు చేసిన వారిని శాశ్వతంగా ముద్ర వేయడం కాకుండా, వారికి సరైన దిశ చూపించి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. యువతపై విశ్వాసం ఉంచి వారికి మంచి విలువలు నేర్పడం ద్వారానే బలమైన భారతాన్ని నిర్మించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్య‌లు ప‌లువురిని ఆలోజింప‌జేస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories