భారత్లో పాస్పోర్ట్ ఫీజులు గతంలో కూడా చాలా సందర్భాల్లో సవరించారు. 1971, 1980, 1993, 2002, 2012 సంవత్సరాల్లో ఫీజులు పెంచగా, తాజాగా 2026లో మరోసారి సవరణలు చేశారు. గత పెంపులను పరిశీలిస్తే, 1971లో నాలుగేళ్ల వ్యవధిలో 67 శాతం, 1980లో తొమ్మిదేళ్లలో 100 శాతం, 1993లో 13 ఏళ్లలో 500 శాతం, 2002లో తొమ్మిదేళ్లలో 233 శాతం, 2012లో పదేళ్లలో 50 శాతం మేర ఫీజులు పెంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
అలాగే పాస్పోర్ట్ చట్టం-1967లోని సెక్షన్ 5(1), పాస్పోర్ట్ రూల్స్-1980లోని రూల్ 8 ప్రకారం పాస్పోర్ట్ దరఖాస్తుతో పాటు నిర్దేశిత ఫీజు చెల్లించడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త ఫీజుల అమలుతో పాస్పోర్ట్ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, సాధారణ ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.