దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన 'బ్రహ్మచారులు'

First Published May 15, 2019, 4:08 PM IST

 దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే నేతల్లో కొందరు బ్రహ్మచారులుగానే ఉన్నారు. సంసార జీవితానికి కొందరు నేతలు దూరంగానే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా పలువురు నేతలు కూడ బ్రహ్మచారులుగా కొనసాగారు.
 

దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారిగా అధికారంలోకి రావడానికి ఏబీ వాజ్‌పేయ్ కారణంగా చెబుతారు. వాజ్‌పేయ్‌ను అన్ని పార్టీలకు చెందిన నేతలు గౌరవిస్తారు. సిద్దాంతరీత్యా విబేధాలు ఉన్నా కూడ వాజ్‌పేయ్‌ను అన్ని పార్టీల నేతలు కూడ గౌరవిస్తారు. 1996 నుండి 2004 వరకు మూడు దఫాలు వాజ్‌పేయ్ ప్రధానిగా సేవలు అందించారు.1996లో తొలిసారిగా వాజ్‌పేయ్ తొలిసారిగా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.13 రోజుల పాటు మాత్రమే వాజ్‌పేయ్ ప్రధానిగా కొనసాగారు.
undefined
ఆ తర్వాత 1998లో వాజ్‌పేయ్ నేతృత్వంలోని ఎన్డీఏ రెండో దఫా అధికారంలోకి వచ్చింది. ఈ దఫా వాజ్‌పేయ్ ప్రభుత్వం 13 మాసాల పాటు అధికారంలో ఉంది. జయలలిత వాజ్‌పేయ్ ప్రభుత్వానికి మద్దతును ఉప సంహారించుకోవడంతో వాజ్‌పేయ్ ప్రభుత్వం కూలిపోయింది.1999 ఎన్నికల్లో వాజ్‌పేయ్ మూడోసారి అధికారంలోకి వచ్చింది. వాజ్‌పేయ్ ప్రభుత్వం ఐదేళ్లపాటు బీజేపీ సర్కార్ అధికారంలో ఉంది. 2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. ఈ ఎన్నికల్లో యూపీఏ సర్కార్ అమల్లోకి వచ్చింది.
undefined
ప్రస్తుత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడ బ్రహ్మచారి. చిన్నతనంలోనే మోడీకి వివాహమైంది. అయితే వివాహమైన కొంతకాలానికి ఆయన ఆమెతో దూరంగానే ఉంటున్నారు. సన్యాస జీవితానికే తాను ఇష్టపడతానని మోడీ ఇటీవల అక్షయ్ కుమార్ ‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
undefined
2001లో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోడీ తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు. 2014 వరకు కూడ ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధానమంత్రిగా ప్రమాణం చేయడానికి ముందే మోడీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.2014 ఎన్నికల్లో ఎన్డీఏ భారీ విజయం సాధించింది. దీంతో మోడీ ప్రధానమంత్రిగా అయ్యారు. 2019 ఎన్నికల్లో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
undefined
కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఇంకా బ్రహ్మచారిగానే ఉన్నాడు. పెళ్లి గురించి రాహుల్‌ను ప్రశ్నిస్తే ఆయన నుండి నవ్వే సమాధానం వస్తోంది.కానీ, ఈ విషయమై ఆయన విషయమై మాత్రం బయటపడడం లేదు.2004 ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సమయంలోనే ఆయనను కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు.గత ఏడాది రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఎన్నుకొన్నారు.రాహుల్ గాంధీ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
undefined
బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌ కూడ బ్రహ్మచారిగానే ఉన్నాడు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూపట్నాయక్ కొడుకే నవీన్ పట్నాయక్.1997లో బిజూ పట్నాయక్ మరణించడంతో నవీన్ పట్నాయక్ రాజకీయాల్లోకి వచ్చాడు. 1998లో నవీన్ పట్నాయక్ బిజూ జనతాదళ్‌ను ఏర్పాటు చేశారు. 2000లో నవీన్‌పట్నాయక్‌‌ తొలిసారిగా ఒడిశా సీఎంగా బాధ్యతలను చేపట్టారు.అవినీతికి వ్యతిరేకంగా నవీన్ పట్నాయక్‌ చేపట్టిన కార్యక్రమాలకు ఆయనకు ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.
undefined
2000 సంవత్సరం నుండి నవీన్ పట్నాయక్‌ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. పలు పుస్తకాలను కూడ ఆయన రాశారు. రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో నవీన్ పట్నాయక్‌కు ఆయన రాష్ట్ర ప్రజలు మాట్లాడే భాష రాదు. ఆయన ఇంగ్లీష్‌లోనే మాట్లాడేవారు. ఆ తర్వాత ఆ భాషను నేర్చుకొన్నారని చెబుతారు.
undefined
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడ వివాహాం చేసుకోలేదు. తెలుగు, తమిళంతో పాటు పలు భాషల సినిమాల్లో నటించిన జయలలిత ద్రవిడ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. అన్నాడిఎంకెలో 1982లో ఆమె చేరారు.ఎంజీఆర్ ప్రోత్సాహాంతో ఆమె అన్నాడీఎంకెలో కీలక నేతగా ఎదిగారు. తమిళనాడు రాష్ట్రానికి ఆరు దఫాలు ముఖ్యమంత్రిగా ఆమె పనిచేశారు.
undefined
1989లో జరిగిన ఎన్నికల్లో డీఎంకె ప్రభుత్వం తమిళనాడులో అధికారాన్ని చేపట్టింది.ఆ ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకె ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. 1991 ఎన్నికల్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అతి పిన్నవయస్కురాలుగా ఆమె రికార్డు సృష్టించారు.
undefined
1996లో జరిగిన ఎన్నికల్లో డీఎంకె ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో కరుణానిధి సర్కార్ జయలలితపై అవినీతి కేసులు పెట్టింది.ఈ కేసుల్లో ఆమెను జైల్లో పెట్టింది డీఎంకె సర్కార్.1998 ఎన్నికల్లో అన్నాడిఎంకె బీజేపీకి మద్దతు ఇచ్చింది. 13 మాసాల తర్వాత జయ పార్టీ వాజ్‌పేయ్ సర్కార్‌కు మద్దతును ఉపసంహరించుకొంది.దీంతో వాజ్‌పేయ్ సర్కార్ కుప్పకూలింది.
undefined
2001 ఎన్నికల్లో అన్నాడిఎంకె తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికే కోర్టు కేసు కారణంగా ఆమె పదవిని కోల్పోయింది. 2011లో జరిగిన ఎన్నికల్లో జయ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ కాలంలో ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆ పార్టీకి కలిసొచ్చాయి. 2016లో కూడ మరోసారి జయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగానే ఉంటూ 2016 డిసెంబర్ 6వ తేదీన ఆమె మృతి చెందారు.
undefined
బీఎస్పీ చీఫ్ మాయావతి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు దఫాలు మాయావతి ముఖ్యమంత్రిగా పనిచేశారు. యూపీ రాష్ట్రంలో బీజేపీని నిలువరించేందుకు ప్రస్తుతం ఎస్పీతో ఆ పార్టీ చేతులు కలిపింది. ప్రధాని రేసులో కూడ ఆమె ఉన్నారు.కాన్షీరామ్ ఏర్పాటు చేసిన బీఎస్పీలో 1984లో ఆమె చేరారు. ఆయన స్పూర్తితో పనిచేశారు. మాయావతి చేసే ప్రసంగాలకు పెద్ద ఎత్తున ప్రజలు ఆ సమయంలో హాజరయ్యేవారు.
undefined
1995లో యూపీకి ఆమె తొలిసారిగా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.3 జూన్ 1995 నుండి 18 అక్టోబర్ 1995 వరకు ఆ పదవిలో కొనసాగారు. రెండో దఫా 21 మార్చి 1997 నుండి 20 సెప్టెంబర్ 1997 వరకు ఆమె సీఎంగా పనిచేశారు.మూడో దఫా 3 మే 2002 నుండి 26 ఆగష్టు 2003 వరకు ఆమె ఈ పదవిలో ఉన్నారు.13 మే 2007లో మాయావతి యూపీకి నాలుగోసారి సీఎంగా ఎన్నికయ్యారు. ఈ దఫా ఆమె పూర్తి కాలం పనిచేశారు.
undefined
బెంగాల్ రాష్ట్రాన్ని పాలించిన వామపక్ష ప్రభుత్వాన్ని కుప్పకూల్చి రెండు దఫాలు వరుసగా అధికారాన్నిచేపట్టిన ఘనత మమత బెనర్జీకి దక్కుతోంది. మమత బెనర్జీ కూడ వివాహం చేసుకోలేదు.సీపీఎంకు వ్యతిరేకంగా మమత బెనర్జీ రాజకీయాల్లోకి ప్రవేశించారు.
undefined
1970లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ రాష్ట్రా మహిళ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. దీదీ గా ఆమెను అభిమానులు పిలుచుకొంటారు. కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి 1997లో ఆమె తృణమూల్ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశారు. 2011 ఎన్నికల్లో బెంగాల్‌లో టీఎంసీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2016లో జరిగిన ఎన్నికల్లో టీఎంసీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకొంది.
undefined
బీజేపీలో కీలక నేతగా ఉన్న ఉమా భారతి కూడ వివాహం చేసుకోలేదు.వాజ్ పేయ్ మంత్రివర్గంలో పలు మంత్రిత్వశాఖలను ఆమె నిర్వహించారు. ఆ తర్వాత కొంత కాలానికి ఆమె బీజేపీకి గుడ్ బై చెప్పారు. కానీ, స్వంత పార్టీ ఏర్పాటు చేసుకొని పోటీ చేసినా ఆమెకు కలిసి రాలేదు. తిరిగి ఆమె బీజేపీలో చేరారు. మోడీ కేబినెట్‌లో ఉమా భారతి కీలకమైన మంత్రిత్వశాఖలను నిర్వహించారు.
undefined
click me!