ఆకుకూరల్లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. ఫైబర్ మలబద్ధకం, ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరలను ఆహారంలో చేర్చడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను తట్టుకునే శక్తిని ఇస్తాయి.