సుశ్రుత సంహిత ప్రకారం.. శ్రావణ మాసంలో ఆకుకూరల వాడకాన్ని తగ్గించాలని స్పష్టంగా పేర్కొనబడింది. ఈ కాలంలో వర్షాల కారణంగా తేమ ఎక్కువగా ఉండటంతో, ఆకుకూరలపై క్రిములు, ఫంగస్, సూక్ష్మజీవులు ఎక్కువగా పెరుగుతాయి.
ఇవన్నీ శరీరానికి హానికరమైన వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది. పైగా, ఆకుకూరలు తేమను ఉత్పత్తి చేసే స్వభావం కలిగి ఉండటంతో, అజీర్ణం, అలర్జీలు, వాంతులు, డయేరియా వంటి సమస్యలు ఏర్పడవచ్చు.