కాంచీపురం ఇడ్లీ చాలా ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. బియ్యం, మినపప్పు నానబెట్టి రుబ్బీ.. రాత్రంతా పులియబెట్టాలి. అందులో నెయ్యిలో వేయించిన కరివేపాకు, ఇంగువ, జీలకర్ర, మిరియాలు, అల్లం వంటి మసాలా దినుసులు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆవిరిపై ఉడికించుకోవాలి. వీటిని చట్నీ లేదా సాంబార్ తో తింటే సూపర్ గా ఉంటాయి.