Fruits: రాత్రిపూట పండ్లు తినొచ్చా? వేటిని అస్సలు తినకూడదు..?

Published : Dec 08, 2025, 12:11 PM IST

Fruits: పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ,  రాత్రి పూట తినొచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.  వేటిని తినాలి? వేటిని తినకూడదు అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం.

PREV
14
రాత్రిపూట పండ్లు...

రాత్రి భోజనం తర్వాత పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది. పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కానీ, వాటిని మనం ఏ సమయంలో తింటున్నామనేది కూడా చాలా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే, రాత్రిపూట శరీరంలో మెటబాలిజం కొద్దిగా మందగిస్తుంది. ఈ సమయంలో ఎక్కువగా ఆహారం తీసుకుంటే అది జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఇక, ఈ సమయంలో పండ్లు తింటే షుగర్ లెవల్స్ కూడా పెరుగుతాయని అంటారు. మరి, దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...

24
ఈ పండ్లు తినవచ్చు...

రాత్రిపూట పడుకునే ముందు పండ్లు తినడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ... ఏ పండ్లు తింటున్నాం అనేది ముఖ్యం. సరైన పండ్లను ఎంచుకోవడంతో పాటు.. సరైన పద్దతిలో కూడా తినాలి. ముఖ్యంగా సులభంగా జీర్ణమయ్యేలా, తేలికగా శరీరానికి శక్తిని అందించేవి ఎంచుకోవాలి. అంటే యాపిల్, బొప్పాయి. పియర్స్, దానిమ్మ, బత్తాయి వంటి పండ్లు రాత్రిపూట తినవచ్చు. ముఖ్యంగా బొప్పాయిలో ఉన్న ఎంజైమ్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇక రాత్రిపూట దానిమ్మ తినడం వల్ల రాత్రిపూట హాయిగా నిద్రపడుతుంది. అయితే.. మరీ ఎక్కువగా తీసుకోకూడదు. మితంగా మాత్రమే తీసుకోవాలి.

34
వీటిని మాత్రం పొరపాటున కూడా తినకూడదు...

అయితే, కొన్ని పండ్లను రాత్రిపూట అస్సలు తినకూడదు. ముఖ్యంగా మామిడి పండు, అరటి పండు, ద్రాక్ష, సపోటా వంటి షుగర్ ఎక్కువగా ఉండే పండ్లు ఈ సమయంలో తినడం మంచిది కాదు. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను త్వరగా పెంచి, జీర్ణక్రియపై ఒత్తిడి పెంచుతాయి. అదేవిధంగా నేరేడు లాంటి పండ్లు కూడా రాత్రిపూట కూడా తీసుకోకూడదు. గ్యాస్, బ్లోటింగ్, కడుపు అసౌకర్యం కలిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా నిరంతరం అసిడిటీ, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలతో బాధపడేవారు ఈ పండ్లు అస్సలు తినకూడదు.

44
పండ్లు ఎలా తినాలి..?

పండ్లు తినే సమయానికి తోడు వాటిని ఎలా తింటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. రాత్రి పండ్లు తినాలంటే భోజనం తర్వాత వెంటనే కాకుండా కనీసం ఒక గంట తర్వాత తినాలి. అలాగే పండ్లతో చేసిన ఫ్రూట్ సలాడ్లు, మిక్స్ చేసిన పండ్లతో పాటు పాలు, పెరుగు కలిపి తినడం మంచిది కాదు. అలా తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా తినాలి. ఎక్కువ క్వాంటిటీలో రాత్రిపూట అస్సలు తినకూడదు. చిన్న బౌల్ లో మాత్రమే తినాలి.

మొత్తం మీద, రాత్రి పూట పండ్లు తినకూడదనే అభిప్రాయం పూర్తిగా తప్పు కాదు కానీ సరైన పండ్లను ఎంచుకుంటే శరీరానికి ఎలాంటి హాని ఉండదు. తేలికపాటి, ఫైబర్ ఎక్కువగా ఉన్న పండ్లు మాత్రమే తీసుకోవడం మంచిది. జీర్ణక్రియ దెబ్బతినకుండా, మంచి నిద్రకు సహాయపడే పండ్లను మాత్రమే తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు పగటి సమయంలోనే పండ్లను తినడం ఉత్తమం,

Read more Photos on
click me!

Recommended Stories