గురూజీ గడ్డం తీసేశారోచ్..చిరంజీవిని కలిసిన త్రివిక్రమ్, కొత్త లుక్ మాములుగా లేదుగా

First Published Jan 27, 2024, 8:44 PM IST

చిరంజీవిని ఒక ప్రత్యేకమైన వ్యక్తి కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరో కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిక అండ్ హాసిని నిర్మాత చినబాబు ఇద్దరూ చిరంజీవిని కలిశారు. 

 రిపబ్లిక్ డే రోజున మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది. దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం ఇది. తెలుగు సినీ రంగంలో విశేషమైన ప్రతిభ కనబరుస్తూ సేవలందిస్తున్న చిరంజీవికి తగిన గౌరవం ఇది. 

దీనితో సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి.. అభిమానుల నుంచి చిరంజీవికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ నుంచి హీరోలు, నిర్మాతలు, దర్శకులు వరుసగా చిరు నివాసానికి క్యూ కడుతున్నారు. మెగాస్టార్ ని కలసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

Latest Videos


ఇప్పటికే దిల్ రాజు, డైరెక్టర్ మారుతి, డివివి దానయ్య, బుచ్చిబాబు లాంటి వారంతా మెగాస్టార్ ని కలసి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా చిరంజీవిని ఒక ప్రత్యేకమైన వ్యక్తి కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరో కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. 

త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిక అండ్ హాసిని నిర్మాత చినబాబు ఇద్దరూ చిరంజీవిని కలిశారు. పద్మ విభూషణ్ పురస్కారం పొందిన సందర్భంగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపి కాసేపు ముచ్చటించారు. 

అయితే ఈ భేటీలో త్రివిక్రమ్ లుక్ నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంది. ఎపుడూ గుబురు గడ్డంతో కనిపించే గురూజీ ఈసారి గడ్డం తీసేశారు. స్మార్ట్ లుక్ లో అదరగొడుతున్నారు. చిరంజీవి, త్రివిక్రమ్ ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. గురూజీ గడ్డం తీసేశారోచ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. 

అదే విధంగా త్రివిక్రమ్ మాత్రమే కాకుండా మరికొందరు సెలెబ్రిటీలు కూడా చిరంజీవిని కలిశారు. వారిలో యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ, యువ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఉన్నారు. 

click me!