త్రిషని అంతలా వేధించి మోసం చేసింది ఎవరు.. మరోసారి లవ్ ఫెయిల్యూర్ ?

First Published Aug 21, 2022, 12:38 PM IST

తెలుగులో వర్షం చిత్రంతో త్రిష హవా మొదలైంది. స్టార్ హీరోలందరితో ఆడి పాడింది. తన అందం, చిలిపితనంతో త్రిష చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు.

తెలుగులో వర్షం చిత్రంతో త్రిష హవా మొదలైంది. స్టార్ హీరోలందరితో ఆడి పాడింది. తన అందం, చిలిపితనంతో త్రిష చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా త్రిష విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. 

39 ఏళ్ల వయసులో కూడా త్రిషకి అద్భుతమైన ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం త్రిష లెజెండ్రీ దర్శకుడు తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే త్రిష వ్యక్తిగత విషయాల గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇదిలా ఉండాగా తాజాగా త్రిష సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ గురించి అభిమానుల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. త్రిష మరోసారి లవ్ లో ఫెయిల్ అయ్యిందా అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. కలుషితమైన మనసు కలిగిన వ్యక్తులు వాళ్ళంతట వాళ్ళే మనతో మాట్లాడడం మానేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. చెత్త తొలిగిపోయినట్లుగా అనిపిస్తుంది అంటూ త్రిష పోస్ట్ పెట్టింది. 

త్రిష ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టింది. ఇందులో మర్మం ఏంటి అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఆమె ఆవేదన చూస్తుంటే మరోసారి ప్రేమలో ఫెయిల్ అయ్యిందా అని చర్చించుకుంటున్నారు. ప్రేమ పేరుతో ఆమెని ఎవరైనా మోసం చేసి బాధ పెట్టారా అని కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

గతంలో త్రిష లవ్ ఎఫైర్స్ గురించి అనేక వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వరుణ్ మణియన్ అనే వ్యాపార వేత్తతో ప్రేమలో పడింది. కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ పెళ్ళికి ముందే అతడి నుంచి విడిపోయింది. 

ఇప్పట్లో ప్రేమ, పెళ్లి లేదు అంటున్న తరుణంలో త్రిష చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు లోకేష్ కనకరాజ్, దళపతి విజయ్ సినిమాలో త్రిష నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది కనుక జరిగితే త్రిషకి గోల్డెన్ ఛాన్స్ దక్కినట్లే. 

click me!