గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న శ్రీలీలా.. అనుపమా, శాన్విలకు సవాల్‌..

First Published Feb 8, 2023, 7:30 PM IST

`ధమాకా` చిత్రంతో విజయాన్ని అందుకుని జోరు మీదుంది శ్రీలీలా. విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ క్యూట్‌ బ్యూటీ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. 
 

`పెళ్లిసందడి`తో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చింది శ్రీలీలా. ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది. సినిమా యావరేజ్‌గానే మెప్పించినా ఈ బ్యూటీకి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు సపోర్ట్ చేయడంతో ఈ బ్యూటీకి మంచి ఊపు వచ్చింది. వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. సక్సెస్‌ జోరులో ఉన్న శ్రీలీలా తాజాగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంది. 
 

గచ్చిబౌలిలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం ,  హస్పెటాలిటీ లో నటి శ్రీలీలా మొక్కలు నాటింది. రాజ్యసభ ఎంపీ శ్రీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా శ్రీలీలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని శ్రీలీలా తెలిపారు. 
 

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరితో కలిపి ఇప్పటికి 17 కోట్ల మొక్కలు నాటడం గొప్పవిషయమని శ్రీలీలా తెలిపారు. ప్రతిఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. 

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టి కర్త ఎంపీ సంతోష్ కుమార్ కి శ్రీలీలా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హీరోయిన్స్  శాన్వి శ్రీవాస్తావ్, అనుపమ పరమేశ్వరన్ తో పాటు తన అభిమానులు మూడు మొక్కలను నాటాలని శ్రీలీలా పిలుపు ఇచ్చారు. 
 

ప్రస్తుతం శ్రీలీలా వరుస సినిమాలతో బిజీగా ఉంది. బాలకృష్ణ-అనిల్‌రావిపూడి చిత్రంలో ఆయనకు కూతురు పాత్రలో కనిపించనున్నట్టు టాక్‌. అయితే ఇందులో నిజం లేదని అనిల్‌రావిపూడి చెప్పడం గమనార్హం. దీంతోపాటు మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే నవీన్‌ పొలిశెట్టితో `అనగనగా ఒక రాజు` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు `జూనియర్‌`, రామ్‌ బోయపాటి చిత్రంలో నటిస్తుంది శ్రీలీలా. 

click me!