సమంత.. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత బోల్డ్ డెసీషన్స్ తీసుకుంటుంది. బోల్డ్ గా ఫోటో షూట్లు చేసి ఆకట్టుకుంది. అదే సమయంలో తన పర్సనల్ విషయాల్లోనూ చాలా మార్పులు చేసుకుంటుంది. అందులో భాగంగా ఆమె ముంబయికి మకాం మార్చబోతుంది. గతంలో ఈ బ్యూటీ ముంబయికి షిఫ్ట్ అయినట్టు వార్తలొచ్చాయి. చాలా రోజులుగా అక్కడే ఉంటోంది. అంతేకాదు మేనేజర్ని కూడా మార్చేసింది. ముంబయి బేస్డ్ మేనేజర్ని ఎంచుకుంది.
ఇప్పుడు పూర్తిగా ముంబయికి షిఫ్ట్ అవుతుందని సమాచారం. ఇకపై ముంబయిలో ఉండేందుకు ప్లాన్ చేసుకుంటుందట. అక్కడ సమంత కొత్తగా ఇళ్లుని కొనుగోలు చేసిందని తెలుస్తుంది. ముంబయిలోని సెలబ్రిటీలు నివసించే పాష్ ఏరియాలో త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుగోలు చేసిందట. త్వరలోనే అందులోకి సమంత షిఫ్ట్ కానుందని సమాచారం.
ఇదిలా ఉంటే దాని కాస్ట్ వివరాలు ఇప్పుడు లీక్ అయ్యాయి. బాలీవుడ్ మూవీ సమాచారం మేరకు సమంత ఏకంగా రూ.15కోట్లు పెట్టి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుగోలు చేసిందట. చాలా లగ్జరీగా ఈ ఫ్లాట్ ఉండబోతుందని సమాచారం. అంతేకాదు అక్కడ నుంచి వ్యూ పాయింట్ బాగుంటుందని తెలుస్తుంది. సమంత ఇటీవల సన్ సెట్ ని ఎంజాయ్ చేస్తూ అభిమానులతో ఇన్ స్టా వేదికగా పంచుకున్న ఓ ఫొటో అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు.
సమంత ప్రస్తుతం తెలుగులో `శాకుంతలం` చిత్రంలో నటించింది. ఇది పాన్ ఇండియా మూవీ. ఈ సినిమా వాయిదా పడింది. ఏప్రిల్లో విడుదల కాబోతుంది. దీంతోపాటు విజయ్ దేవరకొండతో `ఖుషి` సినిమా చేయబోతుంది. వచ్చే నెల నుంచి ఈ చిత్ర షూటింగ్లో పాల్గొంటుంది. కొత్తగా తెలుగులో సమంత మరే సినిమాకి సైన్ చేయలేదు. కానీ హిందీలో మాత్రం మూడు నాలుగు కమిట్మెంట్స్ ఉన్నాయి. నెమ్మదిగా అవి ప్రకటించబోతుంది.
ప్రస్తుతం ఆమె హాలీవుడ్ పాపులర్ సిరీస్ `సిటాడెల్` హిందీ రీమేక్లో నటిస్తుంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న వెబ్ సిరీస్ ఇది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్లో ప్రస్తుతం సమంత పాల్గొంటుంది. దీని తర్వాత ఆమె బాలీవుడ్ సినిమాలను స్టార్ట్ చేయనుందని సమాచారం.
Samantha
హైదరాబాద్లో ఉంటే తన పాతజ్ఞాపకాలు, నాగచైతన్యకు సంబంధించిన గుర్తులు గుర్తొచ్చేఅవకాశం ఉంది. వాటిని పూర్తి మర్చిపోయి, కొత్త లైఫ్ని లీడ్ చేసేందుకు సమంత ఇలా ముంబయికి మకాం మారుస్తున్నట్టు సమాచారం. అంతేకాదు సినిమాలు కూడా బాలీవుడ్లోనే ఎక్కువగా చేసేందుకు ప్లాన్ చేసుకుంటుందని భోగట్టా. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.