కుర్రాళ్లను ఊపేస్తున్న రష్మిక లేటెస్ట్ ఫొటో షూట్ ఫొటోలు
First Published Nov 24, 2020, 8:16 PM ISTసౌత్ ఇండియా సినీపరిశ్రమలో నెంబర్ వన్ ప్లేసుకు పోటీ పడుతున్న స్టార్ లలో ఒకరు రష్మిక మందన. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ అవసరమైన వీడియోలను, కొత్త ఫొటోలను నెటిజన్లతో పంచుకుంటూ ఎప్పుడూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఫ్యాషన్ రంగంలో ఆమెను ఎంతో మంది అభిమానిస్తుంటారు. ఫ్యాషన్ పట్ల ఎంతో అభిరుచి, అవగాహన కలిగివున్న విషయం తెలిసిందే. కన్నడలో ‘కిరిక్ పార్టీ’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. అలాగే తెలుగులో ‘ఛలో’ చిత్రంతో టాలీవుడ్లో అడుగులు వేశారు. ‘గీతా గోవిందం’ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రష్మిక సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాకుండా ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ చిత్రాలలో నటించనున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె తన లేటెస్ట్ ఫొటోలు షూట్ ఫొటోలు వదులింది. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.