టాలీవుడ్ రేంజ్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుడు రాజమౌళి. బాహుబలలితో మన సత్తా చాటిన ఆయన.. 'ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ కదిలి వచ్చేలా చేశారు. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్చరణ్, యంగ్ టైగర్ యన్టీఆర్ హీరోలుగా పాన్ వరల్డ్ మూవీగా 2022 మార్చి 24న రిలీజ్ అయ్యింది సినిమా. రిలీజ్ అయ్యి అవ్వడంతోనే.. రికార్డ్ లు బ్రేక్ చేస్తూ వచ్చిన ఆర్ఆర్ఆర్.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు సృష్టించింది. ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లింది.
హాలీవుడ్ కు నాటు డాన్స్ నేర్పి.. తెలుగు పాటకు.. హాలీవుడ్ కదిలి.. కదం తొక్కేలా చేసింది ఆర్ఆర్ఆర్ టీమ్. నాటునాటు' పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో పాటు.. ఆర్ఆర్ఆర్ మూవీకి ప్రపంచ దిగ్గజ దర్శకుల నుంచి ప్రశంసలు కూడా రావడం.. తెలుగు సినిమాకు దక్కిన అతి పెద్ద గౌరవం. ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న బాలీవుడ్ కూడా సాధించలేని ఎన్నో టాలీవుడ్ సాధిస్తోంది. మన సినిమాను చులకనగా చూసిన బాలీవుడ్, కోలీవుడ్ లను కూడా ఇప్పుడు తెలుగు సినిమానే శాసిస్తోంది.
రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్నో రికార్డ్స్ ను సాధిస్తూ.. ఎప్పుడూ వార్తల్లో నిలిస్తూ వస్తోంది ఆర్ఆర్ఆర్. ఇక తాజాగా ఈసినిమాకు సబంధించిన మరో ఓ క్రేజీ న్యూస్ను చిత్రయూనిట్ అభిమానులతో పంచుకుంది. 2022 అక్టోబర్ 21న ఈ మూవీ జపాన్లో గ్రాండ్గా విడుదలయింది. 44 నగరాల్లో 209 థియేటర్లు, 31 ఐమాక్స్ తెరలపై దీనిని ప్రదర్శించారు. 34 రోజుల్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టి 300 మిలియన్ జపాన్ యెన్ల క్లబ్లో చేరింది.
భారత కరెన్సీలో దాదాపు రూ.18 కోట్లు. దీంతో ఈ క్లబ్లో అత్యంత వేగంగా చేరిన తొలి భారతీయ సినిమాగా రికార్డుకెక్కింది. ఇక జపాన్లో ఈ చిత్రం రిలీజై ఏడాదిన్నర దాటినా అక్కడ ఈ మూవీ క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అక్కడి సినిమా థియేటర్ల ముందు హౌస్ఫుల్ బోర్డులు పెడుతున్నారంటే... ఆర్ఆర్ఆర్ ఎంత సాధించిందో అర్ధం అవుతోంది.
ఇక ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీమ్ తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అంతే కాదు ఈసినిమా చూడటం కోసం మార్చి 18 వరకూ కు డైరెక్టర్ రాజమౌళి జపాన్ వెళ్ళబోతున్నారు. ఈ విషయం తెలియడంతో అక్కడి ప్రేక్షకులు ఆయనతో కలిసి మూవీని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారట. దీంతో వేలాది మంది టికెట్లు కొనుగోలు చేసేందుకు యత్నించారు. ఇక జక్కన్న ముందు ముందు ఇంకెన్ని రికార్డ్ లు క్రియేట్ చేస్తుందో చూడాలి.