ప్రదీప్ కి ప్రేమ లేఖ రాసిన శ్రీముఖి...చదవమంటే సిగ్గు అంటుంది, ఇంతకీ లెటర్ లో ఏముంది?
First Published Oct 18, 2020, 8:46 AM ISTబుల్లితెర ఈవెంట్స్ తీరు మారిపోయింది. ప్రేక్షకులకు సరదా పంచడానికి కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు. షో ఏదైనా ఇద్దరు ముగ్గురు యాంకర్స్ కలిసి స్కిట్స్ తో అలరించడం కామన్ గా మారింది. ఈ స్కిట్స్ లో రొమాన్స్, కామెడీ ప్రధానంగా సాగుతున్నాయి. ఢీ జోడీ వేదికపై సక్సెస్ అయిన ఈ ఫార్ములా అన్ని ఛానెల్స్ మరియు ప్రోగ్రాం అనుసరిస్తున్నాయి. ఇక పెద్ద పండగలు వస్తున్నాయంటే యాంకర్స్ కి చేతినిండా పనే. ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడంతో కోసం ప్రత్యేక కార్యక్రమాలతో దిగిపోతారు.