ప్రదీప్ కి ప్రేమ లేఖ రాసిన శ్రీముఖి...చదవమంటే సిగ్గు అంటుంది, ఇంతకీ లెటర్ లో ఏముంది?

First Published Oct 18, 2020, 8:46 AM IST

బుల్లితెర ఈవెంట్స్ తీరు మారిపోయింది. ప్రేక్షకులకు సరదా పంచడానికి కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు. షో ఏదైనా ఇద్దరు ముగ్గురు యాంకర్స్ కలిసి స్కిట్స్ తో అలరించడం కామన్ గా మారింది. ఈ స్కిట్స్ లో రొమాన్స్, కామెడీ ప్రధానంగా సాగుతున్నాయి. ఢీ జోడీ వేదికపై సక్సెస్ అయిన ఈ ఫార్ములా అన్ని ఛానెల్స్ మరియు ప్రోగ్రాం అనుసరిస్తున్నాయి. ఇక పెద్ద పండగలు వస్తున్నాయంటే యాంకర్స్ కి చేతినిండా పనే. ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడంతో కోసం ప్రత్యేక కార్యక్రమాలతో దిగిపోతారు. 

జీ తెలుగులో దసరా సందర్భంగాఓ స్పెషల్ ఈవెంట్కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్ లో యాంకర్ శ్రీముఖి, ప్రదీప్ ల ప్రేమ, పెళ్లి అనే ఓ స్కిట్ చేయడం జరిగింది.
undefined
దీని కోసం చిలసౌ శ్రీముఖి, చిరంజీవి ప్రదీప్ పేరుతో అందమైన ఓ పెళ్లి కార్డు వేయించేశారు. అలాగే ప్రదీప్ ప్రేమలో ఉన్న శ్రీముఖి అతనికి ఓ లేఖ రాసినట్లు చిన్న రొమాంటిక్ స్కిట్ ప్రదర్శించారు.
undefined
ప్రేమ లేఖ రాసిన శ్రీముఖి...ప్రదీప్ కి ఇస్తుండగా అది ఏమిటని అడిగాడు. నాలోని భావాలు అని శ్రీముఖి రొమాంటిక్ గా చెప్పింది. నీలోని భావాలు ఏమిటో నాకు చదివి చెప్పు అని ప్రదీప్ అడిగాడు.
undefined
దీనికి శ్రీముఖి నాకు సిగ్గు నేను చదవలేను అని రిప్లై ఇచ్చింది. మరి లెటర్ ఎవరు చదువుతారని ప్రదీప్ మదనపడుతుండగా నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. శ్రీముఖి రాసిన ప్రేమ లేఖను ఆయన చదివారు.
undefined
ఆయనతో పాటు ఆ షోలో పాల్గొన్న విష్ణు ప్రియా, అనసూయ మరియు నిహారిక అందరూ చదివారు. శ్రీముఖి ప్రదీప్ కు రాసిన ఆ ప్రేమ లేఖలో ఏముందో తెలుసుకోవాలంటే మాత్రం పండగ వరకు ఆగాల్సిందే.
undefined
దసరా కానుకగా అక్టోబర్ 25న ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. పండుగ బట్టలలో నాగబాబు, నిహారిక, విష్ణు ప్రియా, అనసూయ, శ్రీముఖి మరియు ప్రదీప్ తో పాటు బుల్లితెర యాంకర్స్ అందరూ పాల్గొన్న ఈ షో దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తుంది.
undefined
click me!