అదిరిపోయే కాంబినేషన్‌ః ప్రభాస్‌ `సలార్‌`లో బాలయ్య హీరోయిన్‌ కత్రినా కైఫ్‌..?

First Published Jan 17, 2021, 6:48 PM IST

ప్రభాస్‌ వరుసగా బాలీవుడ్‌ హీరోయిన్లపై మోజు పడుతున్నారు. వరుసగా వారితో రొమాన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లని ఫైనల్‌ చేయగా, తాజాగా మరో హిందీ అమ్మడిని బుట్టలో వేసుకోబోతున్నారు. `సలార్‌` చిత్రంలో క్రతినా కైఫ్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.

ప్రభాస్‌ వరుసగా పాన్‌ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాని పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్‌ కిరంగుదూర్‌ నిర్మిస్తున్నారు. `సలార్‌` సినిమాని ఇటీవల ప్రారంభించారు. `కేజీఎఫ్‌` ఫేమ్‌ యష్‌ ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.
undefined
ఇదిలా ఉంటే తాజాగా ఉంటే ఇందులో హీరోయిన్‌ ఎవరనేది సస్పెన్స్ నెలకొంది. తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ పేరు వినిపిస్తుంది.
undefined
ఇప్పటికే కత్రినా కైష్‌ బాలకృష్ణతో `అల్లరి పిడుగు`, వెంకటేష్‌తో `మల్లీశ్వరి` సినిమాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ ని అలరించింది కత్రినా కైఫ్‌. ఇదే నిజమైతే 16ఏళ్ల తర్వాత కత్రినా కైఫ్‌ తెలుగు సినిమాలో మెరవబోతుందని చెప్పొచ్చు.
undefined
ప్రభాస్‌ ప్రస్తుతం `రాధేశ్యామ్‌`లో నటిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా ఈ సినిమా రూపొందుతుంది. ఇది షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగుతోపాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తుంది.
undefined
దీంతోపాటు బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో `ఆదిపురుష్‌` అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. రామాయణం ప్రధానంగా ఈ సినిమా సాగబోతుంది. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా సినిమాగా ఇది రూపొందుతుంది. ఇందులో హీరోయిన్‌గా కృతి సనన్‌ని ఫైనల్‌ చేశారు. ఇందులో సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడి పాత్ర పోషిస్తున్నారు.
undefined
మరోవైపు ప్రభాస్‌ ..నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇది కూడా పాన్‌ ఇండియాగా రూపొందుతుంది. ఇందులో హీరోయిన్‌గా దీపికా పదుకొనెని ఎంపిక చేశారు. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.
undefined
ఇలా వరుసగా ప్రభాస్‌ బాలీవుడ్‌ హీరోయిన్లతో బ్యాక్‌ టూ బ్యాక్‌ రొమాన్స్ చేయబోతున్నారని చెప్పొచ్చు.
undefined
click me!