నాని ‘దసరా’ షూటింగ్ పూర్తి.. నయా లుక్ లో ఆకట్టుకుంటున్న నేచురల్ స్టార్!

First Published Jan 13, 2023, 1:54 PM IST

నేచురల్ స్టార్ నాని ఊరమాస్ లుక్ లో అలరించబోతున్న చిత్రం ‘దసరా’ (Dasara). పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాని అప్డేట్ అందించారు.  
 

‘శ్యామ్ సింగరాయ్’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న నేచురల్ స్టార్ నాని (Nani)అదే ఊపులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గతేడాది ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘అంటే.. సుందరానికీ’తో అలరించారు. కానీ ఈ చిత్రంతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. 
 

ప్రస్తుతం ‘దసరా’తో  ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. తన కేరీర్ లోనే నాని తొలిసారిగా ఊరమాస్ లుక్ లో నటిస్తున్న చిత్రమిది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) నాని సరసన ఆడిపాడుతోంది. వీరిద్దిరూ గతంలో ‘నేను లోకల్’తో అలరించిన విషయం తెలిసిందే. 

గతేడాదే ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ తాజాగా పూర్తైనట్టు చిత్ర యూనిట్ తెలిపారు. మరోవైపు నాని కూడా సినిమా షూటింగ్ పార్ట్ కంప్టైట్ అయ్యిందంటూ ఫ్యాన్స్ కు ఎగ్జైటింగ్ న్యూస్ అందించారు. ‘సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుందని’  తెలిపారు. 
 

సినిమాను ఈ ఏడాది మార్చి 30న విడుదల చేసేందుకు షెడ్యూల్ చేశారు. తెలుగులో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. నాని అభిమానులు సైతం ‘దసరా’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ పూర్తవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 

ఇప్పటికే  మూవీకి సంబంధించిన పోస్టర్లు, గ్లింమ్స్, ఫస్ట్ సింగిల్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక త్వరలో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ కూడా అందనున్నాయి. ‘దసరా’తో  నాని మాస్ జాతర మొదలవ్వనుంది. ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. 
 

ఇక నాని తన 30వ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌లో చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు. అందుకే గడ్డం తీసేసి నయా లుక్ లో ఆకట్టుకుంటున్నారు. నాని హ్యాండసమ్ లుక్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. డెబ్యూ డైరెక్టర్ శౌర్య దర్శకత్వం వహించనున్నారు.  హేషమ్ అబ్దుల్ సంగీతం అందించనున్నారు. 
 

click me!