సూపర్ స్టార్ మహేష్ బాబు, హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ప్రేమించిన పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. `వంశీ` సినిమా సమయంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. అయితే వీరిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదని చెప్పింది నమ్రత. మొదట ఫ్రెండ్స్ అయి, ఆ తర్వాత ఒకరినొకరం అర్థం చేసుకుని లవ్లో పడినట్టు తెలిపింది నమ్రత.
2000 లో `వంశీ` సినిమాలో నటించగా, 2005లో ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఐదేళ్లు స్నేహం,ప్రేమ, రిలేషన్ కొనసాగింది. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్నాక పెళ్లికి రెడీ అయ్యారు. అయితే కృష్ణ మొదట్లో అభ్యంతరం తెలిపారు. ఆ తర్వాత అంగీకరించారు. అంతేకాదు నమ్రతపై ఆయన ప్రశంసలు కురిపించారు. తన కేరింగ్, రెస్పాన్సిబులిటీ గురించి గొప్పగా చెప్పాడు కృష్ణ.
Mahesh Babu
మహేష్, నమ్రతలకు కొడుకు గౌతమ్ కృష్ణ, కూతురు సితార ఉన్నారు. ఈ ఇద్దరు స్టడీస్లో బిజీగా ఉన్నారు. అయితే సితార మాత్రం కల్చరల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉంటుంది. ఓ యూట్యూబ్ ఛానెల్ని కూడా రన్ చేస్తుంది. యాడ్స్ చేస్తూ సంచలనంగా మారింది. ఆ మధ్య టైమ్స్ స్వ్కైర్ పై ఆమె యాడ్ ప్రదర్శించబడటం విశేషం. ఈ విషయంలో ఆమె సంచలనం సృష్టించిందనే చెప్పాలి.
Mahesh Babu
ఇదిలా ఉంటే ప్రస్తుతం నమ్రత సినిమాలకు దూరమైంది. మహేష్బాబుని పెళ్లి చేసుకున్నప్పట్నుంచే దూరంగా ఉంటుంది. పూర్తిగా ఫ్యామిలీ లైఫ్కే పరిమితమయ్యింది. అయితే కేవలం ఫ్యామిలీనే కాదు, వ్యాపారాలు, మహేష్ కాల్షీట్లు, రెమ్యూనరేషన్ వ్యవహారాలు, యాడ్స్ ఇలాంటి అన్నింటిని నమ్రతనే చూసుకుంటుంది. మహేష్ కి బ్యాక్ బోన్లా ఉంది.
ఇదిలా ఉంటే మహేష్ బాబుకి సంబంధించిన ఓ క్వాలిటీని బయటపెట్టింది నమ్రత. తనకు నచ్చనిది, ప్రారంభంలో తాను ఇబ్బంది పడ్డ విషయాన్ని వెల్లడించింది. మహేష్ బాబు ప్రారంభంలో చాలా రిజర్వ్ డ్ గా ఉండేవాడట. అసలు మాట్లాడేవాడు కాదట. దీంతో ఓరీ దేవుడా ఇలా ఉన్నాడేంటి అనుకుందట. ఎలాగైనా ఆ రిజర్వ్ నెస్ని బ్రేక్ చేయాలని నిర్ణయించుకుని ప్రయత్నించిందట.
మొత్తానికి సక్సెస్ అయినట్టు చెప్పింది. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంటాడని, బాగా మాట్లాడతాడని చెప్పింది. తన గురించి ఆయనకు, ఆయన గురించి నాకు బాగా తెలుసు. బాగా అర్థం చేసుకుంటాడని చెప్పింది నమ్రత. కొన్నేళ్ల క్రితం సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత ఈ విషయాన్ని వెల్లడించింది. ఇప్పుడిది ఇంట్రెస్టింగ్ గా మారింది. వైరల్ అవుతుంది. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. వచ్చే నెలలో ఇది ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది.