రాజ్ తరుణ్ ఇద్దరు లవర్స్ ఫోన్ సంభాషణ వైరల్... లావణ్య-మాల్వి మల్హోత్రా మధ్య వాగ్వాదం!

By Sambi ReddyFirst Published Jul 5, 2024, 7:42 PM IST
Highlights

రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య అతడు హీరోయిన్ మాల్వి మల్హోత్రా తో ఎఫైర్ పెట్టుకున్నాడని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మాల్వి మల్హోత్రాతో ఫోన్ లో లావణ్య వాదనకు దిగింది. ఈ ఆడియో కాల్ రికార్డు వైరల్ అవుతుంది. దీంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 

హీరో రాజ్ తరుణ్ అతిపెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన మీద లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది. ఆమె కథనం ప్రకారం... లావణ్యతో 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఇద్దరి మధ్య శారీక సంబంధం ఏర్పడింది. గుడిలో లావణ్యను రాజ్ తరుణ్ పెళ్లి కూడా చేసుకున్నాడు. మూడు నెలల క్రితం లావణ్య ఇంటి నుండి రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు. రాజ్ తరుణ్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు. 

ఈ కారణంగా లావణ్యను దూరం పెడుతున్నాడు. తన వెంటపడొద్దని, వదిలేయకపోతే చంపి... శవం మాయం చేస్తానని బెదిరించాడు. గతంలో లావణ్యను ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ కేసులో ఇరికించాడు. ఈ కేసులో లావణ్య 45 రోజులు జైల్లో ఉంది. అప్పుడు కూడా రాజ్ తరుణ్ ఆమెకు ఎలాంటి సహాయం చేయలేదు. నాకు రాజ్ తరుణ్ కావాలి అంటున్న లావణ్య... న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఆమె కేసు ఫైల్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

లావణ్య ఆరోపణల మీద రాజ్ తరుణ్ స్పందించారు. లావణ్యతో నేను రిలేషన్ లో ఉన్నమాట వాస్తమే. కానీ మా మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు. గుడిలో పెళ్లి చేసుకున్నాను అనేది కూడా పచ్చి అబద్దం. ఆ అమ్మాయి మరొక అబ్బాయితో నా ఇంట్లోనే కలిసి ఉంటుంది. అతనితో పెళ్లి విషయంలో గొడవ జరిగితే లావణ్య పోలీస్ కేసు పెట్టింది. గతంలో లావణ్య మంచి అమ్మాయి. నాకు చాలా సహాయం చేసింది. ఆ కృతజ్ఞతతో నేను భరించాను. ఆమెకు తర్వాత చెత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. డ్రగ్స్ కి అలవాటు పడిందని... కీలక వ్యాఖ్యలు చేశాడు. 

ఇదిలా ఉంటే లావణ్య ఓ ఆడియో కాల్ రికార్డు మీడియాకు లీక్ చేసింది. ఆ వీడియోలో హీరోయిన్ మాల్వి మల్హోత్రా-లావణ్య మధ్య ఫోన్లో వాగ్వాదం నడుస్తుంది. నీతో రిలేషన్ పెట్టుకున్నాక రాజ్ తరుణ్ తన్ను వదిలేశాడు. నువ్వు చెప్పినట్లు వింటున్నాడు. నీ కాళ్ళు పెట్టుకుంటా రాజ్ తరుణ్ ని వదిలేయ్. నీలాంటి అమ్మాయిలు కెరీర్లో ఎదగలేరు... అని మాల్వి మల్హోత్రాతో లావణ్య వాదనకు దిగింది. మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ తిరగబడరసామీ మూవీ హీరోయిన్. మాల్వి మల్హోత్రా-రాజ్ తరుణ్ మధ్య ఎఫైర్ ఉందని లావణ్య ప్రస్తుతం ఆరోపిస్తుంది.. 
 

click me!