సిరి `క్యారెక్టర్‌ అసాసినేషన్‌` నిజ స్వరూపం బయటపెట్టిన నాగ్‌.. ఉమాదేవికి గుంజీలు, స్వేతకి చెంపదెబ్బలు..

First Published Sep 18, 2021, 11:55 PM IST

బిగ్‌బాస్‌5 రెండో వారాంతానికి చేరుకుంది. శనివారం షోలో రామ్‌చరణ్‌, `మాస్ట్రో` టీమ్‌ సందడి చేయగా, ఇంటి సభ్యులకు దుమ్ముదులిపేశాడు నాగార్జున. బిహేవియర్‌ బాగాలేదని గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. కొందరికి ఫనిష్‌మెంట్‌ లు కూడా ఇచ్చాడు. 
 

బిగ్‌బాస్‌5 శనివారం ఎపిసోడ్‌ రామ్‌చరణ్‌ ఎంట్రీతో స్టార్ట్ అయ్యింది. ఆయన డిస్ని ప్లస్‌ హాట్‌ స్టార్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎన్నికైన సందర్భంగా ఆ డిజిటల్ మాద్యమాన్ని పరిచయం చేశారు. తనపై రూపొందించిన యాడ్‌ని విడుదల చేశారు. ఇందులో చరణ్‌ షో మ్యాన్‌గా అబ్బురపరిచాడు. 

ఆ తర్వాత ఈ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న తొలి చిత్రం `మాస్ట్రో` టీమ్‌ని సందడి చేశారు. ఇందులో నితిన్‌, తమన్నా, నభా నటేష్‌ పాల్గొని హల్‌చల్‌ చేశారు. చిత్ర విశేషాలను పంచుకున్నారు. కాసేపు నాగ్‌ ప్లేస్‌లో రామ్‌చరణ్‌ని స్టేజ్‌కి హోస్ట్ చేశారు. 
 

ఇక ఇంటి సభ్యులతోనూ రామ్‌చరణ్‌ ముచ్చటించారు. వారి గురించి నాగార్జున చెప్పగా వింటూ ఎంజాయ్‌ చేశారు. అనీ మాస్టర్‌ గురించి తన అనుభవాలను పంచుకున్నారు. లోబో పై పంచ్‌లు వేశారు. షణ్ముఖ్‌పై కూడా పంచ్‌లు వేశారు. హమీదని శ్రీరామ్‌ ప్రేమిస్తున్నాడని, కానీ ఆమె ఎస్‌ చెప్పలేదని వెల్లడించారు నాగ్‌.

రామ్‌చరణ్‌ వెళ్లిపోయాడు హౌజ్‌ హాట్‌ హాట్‌గా,హీటెక్కిపోయింది. ఈ వారంలో ఇంటి సభ్యులు చేసిన పొరపాట్లని కడిగి పడేశాడు నాగ్‌. బిహేవియర్ బాగా లేదని చెప్పాడు. ఆట బాగా ఆడుతున్నారని, ప్రాణం పెట్టి ఆడుతున్నారని వెల్లడించారు. కానీ ప్రవర్తలు, మాటల విషయంలో ఆడియెన్స్ తిడుతున్నారని హెచ్చరించారు. 

ఈ సందర్భంగా ఎవరెవరు ఏం తప్పు చేశారని నాగార్జున అడగ్గా ఉమాదేవి తన మాటలు, బూతు పదాల విషయంలో అదుపు తప్పి మాట్లాడానని, కంట్రోల్‌ చేసుకోవాల్సి ఉందని తెలిపింది. దీనికి నాగ్‌ కూడా గట్టిగానే హెచ్చరించారు.గేమ్‌ బాగా ఆడుతున్నారని, కానీ వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని, అది వద్దని హెచ్చరించాడు. ఇంటి సభ్యులు కూడా వాటిని వినలేకపోతున్నారని తెలిపారు. చేసిన తప్పుకి ఉమాదేవి చేత గుంజీలు తీయించాడు నాగ్‌. 

ఆ తర్వాత స్వేత వర్మ చేసిన తప్పులు చెప్పింది. నామినేషన్‌ విషయంలో తాను హ్యూమానిటీ గురించి చెప్పి, హమీద మీద, లోబో మీద పెయింట్‌ వేసిన విధానం హ్యూమానిటీగా ఉందా అని ప్రశ్నించాడు. అందుకు రియలైన్‌ అయిన స్వేత వర్మ క్షమాపణలు కోరుతూ తనకు తానే శిక్ష వేసుకుంది. రెండు చెంపదెబ్బలు వేసుకుంది. 

లోబో కూడా తాను మానస్‌ విషయంలో అన్న మాటలకు క్షమాపణలు చెప్పాడు. లోబో రియలైజేషన్‌కి ఎలాంటి శిక్ష ఇవ్వలేదు నాగ్‌. అలాగే అనీ మాస్టర్‌ కూడా తాను ఓవర్‌గా మాట్లాడానని చెప్పగా అందులో తప్పేమి లేదని తెలిపింది. శ్రీరామచంద్ర కూడా తాను మిస్టేక్‌ చేశానని చెప్పగా, నువ్వు నీలాగా ఆడు అని, బెస్ట సంచాలకుడిగా ఉన్నావని తెలిపాడు. 
 

ఇక సిరి, సన్నీల మధ్య జరిగిన సంఘటని హైలైట్‌గా మారింది. సన్నీ గేమ్‌లో తన టీషర్ట్ లో చేయి పెట్టాడని ఆరోపించింది. గట్టిగా అరిచింది. దీంతో ఆ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. కానీ సిరి కావాలసి హైడ్రామా చేస్తుందని, సన్నీ ఆ పని చేయలేదని నెటిజన్లు కూడా కామెంట్లు చేశారు. అయితే తాను అలా చేయలేదని సన్నీ కూడా చెప్పాడు. కానీ సిరి చేసిన విషయం చర్చనీయాంశంగా మారింది. 
 

దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు నాగార్జున. సిరి ఒకలా, సన్నీ మరోలా, షణ్ముఖ్‌,స్వేతలు ఇంకోలా చెప్పడంతో ఏకంగా వీడియో చూపించాడు. అందులో సిరి టీషర్ట్ లో సన్నీ చేయి పెట్టినట్టుగా లేదు. దీంతో సిరి.. సన్నీ విషయంలో చేసిన `క్యారెక్టర్‌ అసాసినేషన్‌` బయటపడింది.ఇంకా చెప్పాలంటే సిరి నిజ స్వరూపం బయటపడింది. దీనికి క్షమాపణలు చెప్పింది సిరి.మళ్లీ ఇలా రిపీట్‌ కాకుండా చూసుకుంటానని తెలిపింది.

నాగ్‌ సైతం సిరి, షణ్ముఖ్‌లకు వార్నింగ్‌ ఇచ్చాడు. ఏదైనా ఆరోపించే ముందు చెక్‌ చేసుకుని, ఫ్రెండ్స్ ని అడిగి అనాలని, ఆలోచించకుండా ఇతర వ్యక్తిపై అలా ఆరోపణలు చేస్తే ఆడియెన్స్ తప్పుగా అనుకుంటారని హెచ్చరించారు. చివరికి సన్నీకి సిరి చేత హగ్‌ ఇప్పించాడు. మరోవైపు మానస్‌కి హెచ్చరించాడు. సంచాలకుడు అంటూ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని, ఇతరులతో చర్చించి కాదని తెలిపాడు. 
 

click me!