నటి ఆత్మహత్య...వాట్సప్ లో సూసైడ్ నోట్

By Surya PrakashFirst Published Apr 28, 2024, 5:32 PM IST
Highlights

.  శనివారం అమృతా తన వాట్సాప్ స్టేటస్‌పై ఓ నోట్‌ను పోస్ట్ చేసింది. అది పోస్ట్‌ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే తన గదిలో మరణించి కనిపించింది. 


అత్యంత ప్రమాదకరమైన ఒత్తిడి, డిప్రెషన్ చాలా సామాన్యమైన విషయాలైపోతున్నాయి. ఈ ఒత్తిడిని తగ్గించుకుంటే చాలా అనారోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నా అవి తీవ్రమైన ప్రాణాలు తీసేవరకూ గుర్తించలేకపోతున్నారు. తాజాగా తీవ్రమైన ఒత్తిడితో  ప్రముఖ భోజ్‌పురి నటి అమృతా పాండే ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం బీహార్‌లోని భాగల్‌పూర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది. ఆమె తన గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

 అమృత పాండే ప్రస్తుతం తన భర్తతో కలిసి ముంబయిలో నివసిస్తోంది. రీసెంట్ గా  భాగల్పూర్‌లో బంధువుల వివాహానికి వెళ్లింది. ఇంతలోనే ఇలా ఊహించని సంఘటన చోటు చేసుకుంది.  శనివారం అమృతా తన వాట్సాప్ స్టేటస్‌పై ఓ నోట్‌ను పోస్ట్ చేసింది. అది పోస్ట్‌ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే తన గదిలో మరణించి కనిపించింది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

గత కొంతకాలంగా ఆమె డిప్రెషన్‌లో ఉన్నట్లు,మరికొన్ని మానసిక సమస్యలతో ఉన్నట్లు, ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నట్లు  కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక అమృతా పాండే కెరీర్ విషయానికొస్తే.. ఖేసరి లాల్ యాదవ్‌తో కలిసి 'దీవానాపన్' చిత్రంతో తొలిసారిగా నటించింది. ఈ భోజ్‌పురి చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఆమెకు బాగానే ఆఫర్స్ వచ్చాయి. అయితే లో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా నచ్చింది. ఆ తర్వాత 2022లో ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన చంద్రమణి ఝంగ్డేను వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక వీరిద్దరు ముంబైలోనే నివాసముంటున్నారు.అయితే ఆమె డిప్రెషన్ కు కారణం ఏమిటనేది తెలియరాలేదు. ఇన్విస్టిగేషన్ జరుగుతోంది.
 

click me!