Janaki kalaganaledu: జెస్సీ తల్లిదండ్రులతో జ్ఞానాంబ గురించి చెడ్డగా చెప్పిన మల్లిక.. రెచ్చిపోయిన తల్లితండ్రులు

First Published Oct 6, 2022, 10:51 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 6వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..జానకి శ్రీ తో పూజ అంతా చేపిస్తూ ఉంటుంది. పూజ అవుతున్నప్పుడు మల్లిక మనసులో,ఒక అమ్మాయి వచ్చి నా ప్లానంగా చెడగొట్టింది అని అనుకుంటుంది. పూజ అయిపోయిన తర్వాత శ్రీ, అక్క ఈ బొమ్మలకొలువు ఎందుకు పెడతారు అని అనగా జానకి,పూర్వం దేవతలు రాక్షసుల దగ్గర ఓడిపోయారు. అప్పుడు దేవతలు అందరూ ఆదిదేవతకి పూజ చేసినప్పుడు ఆదిదేవత మగ వాళ్లకు ఆయుధాలను, ఆడవాళ్లకు బొమ్మలను ఇచ్చారు.
 

అప్పుడు ఆడవాళ్లు యుద్ధానికి ముందు ఇలా బొమ్మలకొలువు పెట్టగా వాళ్ళు యుద్ధం లో గెలిచారు. అప్పటినుంచి సాంప్రదాయపద్ధంగా మనం ప్రతి సంవత్సరం ఇలా బొమ్మలు కొలువు పెడుతూ ఉంటాము అని చెప్తుంది జానకి.అప్పుడు శ్రీ, మరి రాముడు, సీత, లక్ష్మణుల బొమ్మ ఎందుకు ఉన్నది అని అడగగా, లక్ష్మణుడు, రాముడు తల్లి మాట జవదాటని వాళ్లు. తల్లి మాట వలన రాముడు అడవుల పాలయ్యాడు. రాముడి మాట మీద లక్ష్మణుడు కూడా వెన్నంటే నడిచాడు.

 అన్నదమ్ములు బంధం అలా ఉండాలి అని, తల్లీ, కొడుకుల బంధం అలా ఉండాలి అని చెప్పడానికి వాళ్ళ బొమ్మలు పెట్టాము అని అంటుంది జానకి.అప్పుడు జ్ఞానాంబ మనసులో, జానకి ఈ మాటలు నాకే చెప్తున్నట్టు ఉన్నది. కాస్త ఓర్పుతో ఉంటే వాళ్ళు మారతారు అని నాకు చెప్పకనే చెప్పి నాకు ప్రశాంతతను ఇస్తుంది అని అనుకుంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత శ్రీ నేను ఇంకా బయలుదేరుతాను అని అనగా రామా దింపుతాడు. తర్వాత మల్లికా బాధపడుతూ ప్లాన్ అంతా పోయిందే.

అయినా పర్లేదు నాకు ఇంకో ప్లాన్ ఉంది కదా అని చెప్పి జెస్సి వాళ్ళ నాన్న పీటర్ కి ఫోన్ చేసి, మీ కూతురు ఇక్కడ అస్సలు బాగాలేదు. మా అత్తయ్య గారు తనని కోడలిలా కాదు కదా కనీసం సాటి మనిషి లా కూడా చూడడం లేదు. అసలు విలువ ఇవ్వడం లేదు. మరోవైపు అమ్మని ఏమనలేక అఖిల్ కూడా ఏమీ చేయలేకపోతున్నాడు. జానకిరామాలు బొమ్మను చూస్తున్నట్టు ఉన్నారు కానీ ఏమాత్రం సహాయం చేయట్లేదు మీరు వచ్చి మాట్లాడితే కానీ జెస్సికి ఇక్కడ సమస్యలు తీరవు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మల్లిక. అప్పుడు పీటర్, జ్ఞానాంబ గారు ఇలా ఉంటారని నేను అనుకోలేదు.
 

వెంటనే వెళ్లి మనం మాట్లాడాలి అని అనుకుంటారు. అప్పుడు మల్లిక,జానకి, ఎలాగైనా నువ్వు ఈ పరీక్షలు రాయకుండా ఫెయిల్ చేసేలా చేసేంతవరకు నేను ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను అని అనుకుంటుంది. మరోవైపు జానకి రాత్రి చదువుతూ ఉండగా రామ వచ్చి టీ కలుపుతాడు. అప్పుడు జానకి, నేను బానే చదువుతున్నాను రామ గారు మీరు వెళ్లి పడుకోండి. నా గమ్యం నాకు గుర్తున్నది మీరు నా గురించి శ్రమ పడొద్దు అని చెప్తుంది. ఆ తర్వాత రోజు ఉదయం మల్లిక చాలా దూరం వచ్చి జాగింగ్ చేస్తూ, హమ్మయ్య ఇంటి నుంచి చాలా దూరం వచ్చేసాను.
 

జానకి వాళ్ళు జాగింగ్ కి ఇక్కడి వరకు రారు ఇంటి బయటనే స్థలంలోనే చేస్తారు. ఇప్పుడు జెస్సి వాళ్ళ తల్లిదండ్రులు వస్తే అక్కడ నుంచి తప్పించుకోవడానికి ఇంత దూరం వచ్చాను, వ్యాయామం చేస్తూ హీరోయిన్ లాగా అయిపోవాలి అనుకొని అక్కడ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండగా, జానకిరామాలు అక్కడికి వచ్చి మల్లిక ని చూస్తారు. అప్పుడు మల్లిక, ఎక్సర్సైజులు చేస్తూ వాళ్ళని చూడగా, రామేశ్వరం వచ్చిన శనీశ్వరం పోనట్టు వీళ్ళు ఇక్కడికి వచ్చేసారు ఏంటి అని అనుకుంటుంది.

అప్పుడు, ఏం చేస్తున్నావ్ మల్లిక అని జానకి అడగగా,వ్యాయామం చేస్తున్నాను అని అంటుంది మల్లిక. నువ్వు కడుపుతో ఉన్నావు కదా ఇలాంటివి చేయకూడదు వెళ్లి వాకింగ్ చేయు అని జానకి చెప్తుంది. అప్పుడు మల్లిక రన్నింగ్ చేస్తూ ఉంటుంది.అప్పుడు జానకి, నేను వాకింగ్ చేయమన్నాను మల్లికా, రన్నింగ్ చేయమనలేదు,కడుపులో బిడ్డకు ప్రమాదం. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకొ అని అనగా అప్పుడు మల్లిక కింద రాయను తాకి పడిపోతున్నప్పుడు జానకి మల్లికను పట్టుకుంటుంది.
 

అప్పుడు జానకి, ఓవరాక్షన్ చేయకుండా ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో మల్లిక అని అంటుంది. మరోవైపు ఇంట్లో గోవిందరాజు, జ్ఞానాంబ తో, ఈ నవరాత్రులు అయ్యేలోగా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పోయి మనశాంతిగా ఉంటే బాగుండు అని అంటాడు. ఇంతలో జెస్సి,తల్లిదండ్రులు అక్కడికి వస్తారు.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!