పేరెంట్స్ బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడనిచ్చేవారు కాదు... గుండె పగిలినంతపనైంది!

First Published Dec 13, 2020, 10:51 AM IST
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు. తాజా ఇంటర్వ్యూలో కియారా అద్వానీ తన ఫస్ట్ లవ్ గురించి రివీల్ చేయడం జరిగింది. 
కియారా అద్వానీ నటించిన ఇందుకీ జవానీ మూవీ ఇటీవల విడుదలైంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ పాల్గొన్న కియారా తన ఫస్ట్ లవ్ గురించి తెలియజేసింది.
undefined
కియారా అద్వానీ టీనేజ్ వయసులో తన క్లాస్ మేట్ తో ప్రేమలో పడ్డారట. అతనిని రహస్యంగా కలవడానికి ఇంట్లో సాకులు చెప్పేదట. కియారా లవ్ స్టోరీ తెలుసుకున్న పేరెంట్స్ అతన్ని కలవకుండా ఒత్తిడి చేశారట.
undefined
చదువు పాడైపోతుందనే భయంతో అతనితో కనీసం ఫోన్ కూడా మాట్లాడనిచ్చే వారు కాదట. ఆ సమయంలో కియారా అద్వానీ చాలా ఆవేదనకు గురయ్యారు. అతన్ని కలవక పోవడంతో తన గుండె పగిలింత పనైందని కియారా చెప్పుకొచ్చారు.
undefined
ఇక కియారా అద్వానీ ప్రస్తుతం తన స్టేటస్ సింగిల్ అని చెప్పుకొచ్చింది. ఒక వేళ ఎవరితోనైనా డేటింగ్ కి వెళితే అతను అడగగానే ముద్దు ఇవ్వను అని చెప్పింది. ముద్దు కోసం అతను ఆరాట పడేలా చేసి అప్పుడు కిస్ ఇస్తాను ఓపెన్ గా చెప్పేసింది.
undefined
తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలలో నటించిన కియారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో టాలీవుడ్ ని పెద్దగా పట్టించుకోవడం లేదు.
undefined
ప్రస్తుతం కియారా చేతిలో మూడు హిందీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. షేర్షా, బూల్బులియా2 మరియు జగ్ జగ్ జియో చిత్రాల్లోకియారా నటిస్తున్నారు.
undefined
click me!