కలెక్షన్లలో అదరగొడుతున్న ‘కార్తికేయ 2’.. షాకింగ్ గా మొదటి వారం వసూళ్లు.. ఎంత వచ్చిందంటే?

First Published Aug 20, 2022, 2:18 PM IST

బాక్సాఫీస్ వద్ద ‘కార్తికేయ 2’ (Karthikeya 2) కాసుల వర్షం కురిపిస్తోంది.  రోజురోజుకు కలెక్షన్లు, ఇటు థియేటర్ల సంఖ్య పెంచుకుంటూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం లాభాల బాటలో దూసుకెళ్తున్న  ఈ చిత్రం మొదటి వారం కలెక్షన్లు షాకింగ్ ఉన్నాయి. 
 

విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ హీరో నిఖిల్ కు ‘కార్తికేయ 2’ మంచి సక్సెస్ ను తీసుకొచ్చింది. ఈ మైథలాజికల్ ఫిల్మ్ కు ఓ రేంజ్ లో ప్రేక్షకాదరణ దక్కుతోంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది.

ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.12.80 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగగా.. కేవలం మూడు రోజుల్లోనే రూ.20 కోట్లకు పైగా వసూళ్లు చేసి బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుంది. ఆగస్టు 13న  రిలీజ్ అయిన ఈ చిత్రం నిన్నటితో వారం రోజులను పూర్తి చేసుకుంది. తాజాగా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. 

ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తున్న ఈ చిత్రం మొదటి వారం కలెక్షన్లు షాకింగ్ ఉన్నాయి. తొలుత తక్కువ స్క్రీన్లలోనే ఆడిన ఈ చిత్రం ప్రస్తుతం స్క్రీన్ల సంఖ్యనూ పెంచుకొని భారీగా కలెక్షన్లను రాబడుతోంది. అధికారిక సమాచారం మేరకు.. ఈ చిత్రం వారం రోజుల్లో రూ. 60.12 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వసూళ్లు వచ్చినట్టు తెలిపారు. 
 

ఇటు తెలుగు స్టేట్స్ తో పాటు.. అటు నార్త్ లోనూ కార్తీకేయ 2కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటం విశేషం. ఇటీవల కాలంలో ప్రేక్షకుల మన్ననలతో పాటు కాసుల వర్షం కురిపించిన చిత్రాల్లో ‘కార్తికేయ 2’ ఒకటిగా నిలిచింది. మున్ముందు మరింతగా కలెక్షన్స్ సాధించే దిశగా పయనిస్తోంది. 

రెండో వారంలో ‘కార్తికేయ 2’వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇవ్వాళ రేపు శని, ఆదివారాలు కావడంతో ఈ రెండు రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టనుందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నేటి కలెక్షన్లు కలుపుకొని రూ.70 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మరోవైపు యూఎస్ఏలోనూ అదిరిపోయే కలెక్షన్స్ ను సాధించింది. మూడు రోజుల్లోనే రూ.4 లక్షల డాలర్స్ ను సాధించింది. మొన్నటి వరకు 700కే డాలర్స్ ను సాధించి తెలుగు సినిమా సత్తాను చాటింది. 
 

మూవీలో హీరోహీరోయిన్లుగా  నిఖిల్ సిద్ధార్థ - అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా నటించారు. టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై చిత్రాన్ని నిర్మించారు. విజువల్ వండర్స్ గా వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది.

click me!