Devatha: రాధ కోసం తల్లిని చంపబోయిన మాధవ్.. ఆసుపత్రిలో విషమంగా జానకమ్మ ఆరోగ్యం!

First Published Sep 24, 2022, 11:43 AM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 24వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...జానకమ్మ ఇంట్లో వాళ్ళందరికీ నిజం చెప్తాను అని అంటుంది. మాధవ్ ఎంత అడ్డుకున్నా సరే జానకమ్మ బయటకు వెళ్లడానికి ప్రయత్నించగా మాధవ్ జానకమ్మని మెట్ల మీద నుంచి కింద పడేస్తాడు.జానకమ్మ కింద పడిపోతుంది.అప్పుడు జానకమ్మ చేతిలో ఉన్న లగ్నపత్రికని, తాలిని తీసి దాచేస్తాడు. జానకమ్మ స్పృహ కోల్పోతుంది. మాధవ్ ఏడుస్తూ అమ్మ! అమ్మ! అని అరుస్తూ ఉంటాడు.అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఏమైంది అని పడగట్టి వచ్చేసరికి జానకమ్మ స్పృహ కోల్పోయి ఉంటుంది. తల నిండా రక్తపు మరకలు ఉంటాయి. అప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్తారు. దేవి,చిన్మయి, భాగ్యమ్మ ముగ్గురు ఇంట్లో ఉంటారు. అప్పుడు రుక్మిణి, మాధవులు జానకమ్మని ఆసుపత్రికి తీసుకువెళ్లగా డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నారు కొంచెం సేపు ఆగాలి అని నర్స్ అంటుంది. 

అప్పుడు జానకమ్మ భర్త, నా భార్యకి చిన్న నొప్పి పుడితేనే నేను తట్టుకోలేను అలాంటిది మెట్ల మీద నుంచి కింద పడిపోయింది అంటే ఎంత నొప్పి భరిస్తూ ఉంటుందో అని ఏడుస్తూ ఉంటాడు. వెనకాతల మాధవ్ మనసులో, నీకు నాకు మధ్య వస్తే మా అమ్మ నే వదలలేదు చూసావు కదా అని అనుకుంటాడు.అదే సమయంలో సత్య, ఆదిత్యలు పడుకొని ఉంటారు. రుక్మిణి ఆదిత్య కి ఫోన్ చేస్తుంది చెప్పు రుక్మిణి అని అనగా, సత్య వింటుంది.అప్పుడు ఆదిత్య సత్య పడుకొని ఉండటం చూసి గది బయటకు వెళ్లి మాట్లాడి ఏ హాస్పిటల్లో ఉన్నారు నేను వస్తున్నాను అని బయలుదేరుతాడు. ఆదిత్య వెళ్ళిపోయిన తర్వాత అక్క దగ్గరికి వెళ్తున్నాడా అని సత్య అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో దేవి,చిన్మయి లు  దేవుడికి ప్రార్థిస్తూ నానమ్మకి ఏమి అవ్వకూడదు అని అనుకుంటారు.అప్పుడు భాగ్యమ్మ, ఏమీ అవ్వదమ్మా మీ అవ్వ గట్టిది, దేవుడు ఎప్పుడు మంచి వాళ్లకు తోడుగానే ఉంటాడు అని అంటాడు.

 ఇంతలో  ఆదిత్య అక్కడి హాస్పిటల్ కి వెళ్తాడు. జానకమ్మ వాళ్ల భర్త ఆదిత్యని పట్టుకొని మెట్ల మీద నుంచి కింద పడిపోయింది బాబు అని ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో  డాక్టర్ అక్కడికి వస్తారు.ఏమైంది అని ఆదిత్య అడగగా, పెద్ద డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు కొంచెం సేపట్లో బయటకు వస్తారు అని అంటారు. అప్పుడు మాధవ్ వచ్చి,ఇక్కడ మేము అందరం ఉన్నాము కదా! నీ అవసరం ఇక్కడ లేదు వెళ్ళిపోతే మంచిది నిన్ను ఎవరు పిలిచారు అని ఆదిత్యతో ఉంటాడు. 
 

అప్పుడు తో నీ ప్రవర్తనని ఇంక మార్చుకోవా, అక్కడ మీ అమ్మ అంత నొప్పితో హాస్పిటల్ లో ఉంటే నువ్వు ఇక్కడ ఇలా మాట్లాడుతున్నావు అని తిడతాడు మాధవ్ వాళ్ళ నాన్న. ఆ తర్వాత సీన్ లో  సత్య తన గదిలో కూర్చొని, ఆదిత్య అక్క దగ్గరికి వెళ్ళాడా! అయినా ఇంత రాత్రి అప్పుడు వెళ్లాల్సిన అవసరమే ఉంటుంది. అంటే నేను ఇన్ని రోజులు అనుకున్నది అంతా నిజమేనా, ఆరోజు అక్క నాకోసం అని వెళ్ళిపోయింది అని ఎంతో ఆనందపడ్డాను కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చింది.
 

 ఆదిత్య దేవి వంకతో అక్కడి కలవడానికి వెళ్తున్నాడా? అయినా అక్కకి పెళ్లి అయ్యి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదిత్య కి నేను భార్యని ఉన్నాను. అయినా ఇప్పుడు కలుస్తున్నారంటే వాళ్ళిద్దరి మధ్య ఇంకా ప్రేమ చావలేదా! వాళ్ల కోసం నా కాపురాన్ని నేను చెడగొట్టుకోలేను, అయినా అక్క నా గురించి ఆలోచించ లేనప్పుడు నేను ఎందుకు అక్క గురించి ఆలోచించాలి? అయినా అక్క నాకు సొంత అక్కేం కాదు కదా! ఈరోజు నుంచి నేను చేయాల్సిన ప్రయత్నాలు నేను చేస్తాను అని అంటుంది. 
 

ఆ తర్వాత సీన్లో జానకమ్మ జరిగిన విషయం గుర్తుతెచ్చుకొని కళ్ళు తెరుస్తుంది రాధా! రాధా! అని అంటుంది.నర్స్ వెళ్లి ఇక్కడ ఆవిడ కళ్ళు తెరిచారు రాద అని  అంటున్నారుఅనగా అందరూ లోపలికి వెళ్తూ ఉండగా, నర్స్ ఆపి ఎవరో ఒకరే వెళ్లాలి అని అంటుంది. అప్పుడు రాద లోపలికి వెళ్తుంది. మాధవ్ భయపడిపోతాడు. అప్పుడు జానకమ్మ రాదని చూసి రాధ చేయి పట్టుకుని రాధా రాధా అని అలమటిస్తూ ఉంటుంది. ఏంటమ్మా చెప్పండి అని అనగా వెనకాతల నుంచి మాధవ్ జానకమ్మ వైపు కోపంగా చూస్తాడు. 
 

అప్పుడు జానకమ్మ మళ్ళీ స్పృహ కోల్పోతుంది. అప్పుడు నర్స్, మిమ్మల్ని చూసి ఆవిడ బాగా ఎక్సైట్ అయ్యారు కొంచెం మీరు బయటికి వెళ్తే డాక్టర్ గారు వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు అని అంటుంది. ఆ తర్వాత రోజు ఉదయం దేవుడమ్మ,సత్య హాల్లో ఉండగా ఆదిత్య అక్కడికి వస్తాడు.రాత్రంతా ఎక్కడికి వెళ్లావు రా నీ కోసం ఎదురు చూసాము అని దేవుడమ్మ అనగా, జానకమ్మ గారికి దెబ్బ తగిలింది అంటే అమ్మ హాస్పిటల్ కి వెళుతుంది, అక్కడ రుక్మిణి ఉన్నది ప్రమాదకరం అని మనసులో అనుకొని,ఒక మీటింగ్ ఉందంట అమ్మ.
 

 దానికోసం రాత్రికి రాత్రి ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆదిత్య.అప్పుడు సత్య మనసులో, ఆంటీ కూడా అబద్ధం చెప్తున్నాడు అంటే అక్క వల్లే.అక్క కోసమే అందుకే దేవి మీద అంత ప్రేమ చూపుతున్నాడా? అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటుంది సత్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!