ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రాల్లో `సలార్` ఒకటి. `కేజీఎఫ్` దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది. కోల్ మైనింగ్, ఈ నేపథ్యంలో సాగే కథతో సినిమా రూపొందుతుందని తెలుస్తుంది.
undefined
ఇందులో ప్రభాస్ కార్మికులకు నాయకుడిగా, అణచివేతపై పోరాడే నాయకుడిగా కనిపిస్తాడని తెలుస్తుంది. దర్శకుడు కూడా ఇదే విషయాన్ని సినిమా అనౌన్స్ మెంట్ టైమ్లో ప్రకటించారు. ఇందులో ప్రభాస్ లుక్ కూడా గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉండబోతుందని తెలుస్తుంది.
undefined
ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రభాస్ `బిల్లా` చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. అలాగే `బాహుబలి`లోనూ డ్యూయెల్ రోల్ చేయబోతున్నారని సమాచారం. ఇందులో సలార్కి గాడ్ఫాదర్ ఉంటారని, ఆ పాత్రకి చిరంజీవి లాంటి ఇతర పెద్ద హీరోలను అనుకున్నప్పటికీ ప్రభాస్తోనే చేయించాలని అనుకుంటున్నారట. అందులో భాగంగా వృద్ధుడిగా ఉండే గాడ్ఫాదర్ పాత్రని కూడా ప్రభాస్ చేత చేయించాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
undefined
ఇదిలా ఉంటే ఇందులో గ్లామర్ మరింతగా తోడవుతుంది. ఇప్పటికే మెయిన్ హీరోయిన్గా శృతి హాసన్ని ఎంపిక చేశారు. అలాగే `కేజీఎఫ్` హీరోయిన్ శ్రీనిధి శెట్టిని ఎంపిక చేస్తున్నారనే వార్తలొచ్చాయి. ఈ ఇద్దరే కాదు, మరో నటిని కూడా దించబోతున్నారట.
undefined
అయితే ప్రభాస్కి సోదరి పాత్ర కోసం మరో నటిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. రమ్యకృష్ణ పేరు వినిపించింది. కానీ ఇప్పుడు సూర్య భార్య, నటి జ్యోతికని తీసుకోవాలనుకుంటున్నారట. ఇందులో ప్రభాస్కి అక్క పాత్ర కోసం జ్యోతికని ఎంపి చేయాలనుకుంటున్నారని టాక్. తెలుగు, తమిళంలో జ్యోతికని, కన్నడలో ప్రియాంక త్రివేదిని ఎంపిక చేయబోతున్నట్టు టాక్.
undefined
దీంతో ఈ సినిమా రేంజ్ క్రమంగా పెరిగిపోతుంది. `కేజీఎఫ్` లాంటి పాన్ ఇండియా సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడంతో `సలార్`పై ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగుదూర్ నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్ర షూటింగ్ కరోనా వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే.
undefined