'రాహుల్ గాంధీ ఒక ఇడియట్.. సోనియా నిస్సహాయురాలు.. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

Published : May 04, 2024, 04:37 PM IST
'రాహుల్ గాంధీ ఒక ఇడియట్.. సోనియా నిస్సహాయురాలు.. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

Lok Sabha elections 2024 : వారాల సస్పెన్స్, అనిశ్చితికి తెరదించుతూ ఉత్తరప్రదేశ్ లోని అమేథీ, రాయ్ బరేలీలలో సంప్రదాయ గాంధీ కుటుంబ స్థానాలకు కాంగ్రెస్ శుక్రవారం తన అభ్యర్థులను ప్రకటించింది. త‌న త‌ల్లి సోనియా స్థాన‌మైన రాయ్ బ‌రేలీ నుంచి రాహుల్ గాంధీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు.   

Lok Sabha elections 2024 :  సార్వ‌త్రిక ఎన్నిక‌ల క్ర‌మంలో బీజేపీ నాయ‌కులు గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవల బీర్‌బైసెప్స్‌ అనే యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుబ్రమణ్యస్వామి రాహుల్ గాంధీ, సోనియాగాంధీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారు భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారనీ, వారిపై ఇత‌రుల‌ బలవంతం కారణంగానే వారు రాజకీయాల్లో ఉన్నారని స్వామి ఆరోపించారు.

ఈ బలవంతం లేకపోతే అవినీతి ద్వారా అక్రమార్జనతో యూరప్ కు పారిపోయి ఉండేవారని బీజేపీ నేత పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఒక ఇడియ‌ట్ అనీ, సోనియా గాంధీ నిస్స‌హాయ‌స్థితిలో ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం స్వామి చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. 

 

 

ఇదిలా ఉండగా, అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యకరమైన మలుపు తిరిగింది. అమేథీలో పోటీ చేసి తిరిగి కైవసం చేసుకోవాలని భావించిన రాహుల్ గాంధీ, బదులుగా తన తల్లి సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లిన తర్వాత ఖాళీ చేసిన రాయ్‌బరేలీ స్థానం నుంచి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. కాంగ్రెస్ కుటుంబ కంచుకోట అయిన అమేథీలో, గాంధీ కుటుంబానికి చిరకాల విధేయుడైన కిషోరి లాల్ శర్మను కాంగ్రెస్ పోటీకి దింపింది. ప్రయత్నాలు చేసినప్పటికీ, ప్రియాంక గాంధీ వాద్రా తన తల్లి తరపున దశాబ్దానికి పైగా ఆమె పోషించిన నియోజకవర్గమైన రాయ్‌బరేలీ నుండి పోటీ చేయడానికి ఒప్పించలేకపోయారు.

వారంరోజులుగా ఉత్కంఠగా సాగిన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఎట్టకేలకు శుక్రవారం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ప్రతిష్టాత్మకమైన రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన తరువాత, ప్రియాంక గాంధీ వాద్రా తన విధేయత-అంకితభావం ఎన్నికలలో విజయానికి దారితీస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ కేఎల్ శర్మకు తన అభినందనలు తెలియజేశారు.

ప్రధాని మోడీ ద్వారకా పూజ ఒక డ్రామా.. సనాతన ధర్మాన్ని మళ్లీ ప్రశ్నించిన రాహుల్ గాంధీ.. వీడియో !

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu