సాయం కోసం నా ఇంటికి రావొద్దు... ట్విస్ట్ ఇచ్చిన పల్లవి ప్రశాంత్! మేటర్ ఏంటంటే!

First Published Mar 21, 2024, 8:49 AM IST


పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ గా గెలుచుకున్న డబ్బులు పేద రైతులకు పంచుతానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సహాయం కోసం ఇంటికి రావొద్దని అతడు తెలియజేశాడు. 
 

Pallavi Prashanth

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ రూ. 35 లక్షలు ప్రైజ్ మనీ, ఒక కారు, డైమండ్ నెక్లెస్ గెలుచుకున్నాడు. కాగా హౌస్లో పల్లవి ప్రశాంత్ ఒక హామీ ఇచ్చాడు. తాను కనుక టైటిల్ గెలిస్తే ప్రైజ్ మనీ పేద రైతులకు పంచుతానని చెప్పాడు. 

Pallavi Prashanth

షో ముగిసి నెలలు గడిచినా పల్లవి ప్రశాంత్ డబ్బులు పంచలేదు. దాంతో విమర్శలు వెల్లువెత్తాయి. మాట తప్పాడంటూ కొందరు ట్రోల్ చేశారు. అయితే ఇటీవల పల్లవి ప్రశాంత్ మొదటి సహాయం చేశాడు. తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులకు రూ. 1 లక్ష ఆర్థిక సహాయం అందించాడు. అలాగే ఏడాదికి సరిపడా బియ్యం సమకూర్చాడు. 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

Pallavi Prashanth

ప్రాణం పోయినా మాట తప్పేది లేదని సోషల్ మీడియాలో తాను సహాయం చేసిన వీడియో పోస్ట్ చేశాడు. ఇలానే మరికొందరికి సహాయం చేస్తానని పల్లవి ప్రశాంత్ వెల్లడించాడు. పేద రైతులకు పల్లవి ప్రశాంత్ సహాయం చేస్తున్నాడన్న విషయం తెలిసి చాలా మంది పల్లవి ప్రశాంత్ ఇంటికి వస్తున్నారట. 

తాము కష్టాల్లో ఉన్నాము. సహాయం చేయాలని కోరుకుంటున్నారట. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ తన ఇంటికి రావద్దని అభ్యర్ధించాడు. పలు ప్రాంతాల నుండి సహాయం చేయాలంటూ ఇంటికి వస్తున్నారు. దయచేసి మా ఇంటికి రావద్దు. మా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టొద్దు. అర్హులైన వారిని మా టీమ్ గుర్తించిన తర్వాత ఆదుకుంటాము. 

Pallavi Prashanth

నేనే మీ దగ్గరకు వస్తాను. మీరు మా ఇంటికి రావద్దు.. అంటూ కోరుకున్నాడు. నిజంగా ఎవరు రైతులో, పేదవారో తెలుసుకుని సహాయం చేస్తామని పల్లవి ప్రశాంత్ పరోక్షంగా చెప్పాడు. పల్లవి ప్రశాంత్ కి రూ. 35 లక్షలు ప్రైజ్ మనీ రూపంలో రాగా అందులో కొంత ట్యాక్స్ కటింగ్స్ కి పోయింది. మిగిలినది పల్లవి ప్రశాంత్ పేద రైతులకు సహాయంగా ఇవ్వనున్నాడు. 

click me!