'బటన్' రాజకీయాలపై హరీష్ శంకర్ డైరక్ట్ సెటైర్

Published : May 13, 2024, 12:35 PM IST

దర్శకుడు హరీష్ శంకర్ ఓటు హక్కు ప్రాధాన్యత గురించి బటన్ రాజకీయాల గురించి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం తెలియచేసారు.  

PREV
17
 'బటన్' రాజకీయాలపై హరీష్ శంకర్ డైరక్ట్ సెటైర్

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి  మొదలైంది. దేశ విదేశాల నుంచి కూడా వచ్చి చాలా మంది తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. పోలీంగ్ హోరా హోరీగా జరుగుతోంది.   సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఖచ్చితంగా ఓటు వేసి తమ సత్తా ఏమిటో చూపించి తమ నాయకుడుని ఎన్నుకోవాలని ఉత్సాహంగా ఉన్నారు. 
 

27


 సామాన్యులకు ప్రేరణ ఇస్తూ సెలబ్రెటీలు లైన్ లో నుంచుని మరీ తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ ఓటు హక్కు ప్రాధాన్యత గురించి బటన్ రాజకీయాల గురించి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం తెలియచేసారు.

37


"రాజకీయాల్లోకి వచ్చి సంపాదించిన నాయకులు కాదు. సంపాదించింది రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం ఖర్చుపెట్టిన నాయకున్ని గుర్తించండి. ఎవరో బటన్ నొక్కితే బతికే కర్మ మనకు లేదు. మన బటన్ మనమే నొక్కాలి. అదే ఈరోజు ఈవీఎం బటన్ అవ్వాలి. ఓటు మన హక్కు మాత్రమే కాదు మన బాధ్యత కూడా"  అంటూ ట్వీట్ చేశారు హరీష్ శంకర్. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
 

47

ఇక ఈ ట్వీట్ అర్దం చాలా మందికి ఇట్టే అర్దమవుతోంది. పవన్ ని సపోర్ట్ చేస్తూ హరీష్ శంకర్ ఈ ట్వీట్ చేసారు. పవన్ కళ్యాణ్ తను సినిమాల్లో సంపాదించిన డబ్బు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం ఖర్చుపెట్టిన సంగతి తెలిసిందే. అలాగే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ..బటన్ నొక్కే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. అదే విషయం ఇలా హరేష్ శంకర్ ఇన్ డైరెక్ట్ గా గుర్తు చేసారన్నమాట. 

57

పవన్ కళ్యాణ్ కు  హరీష్ శంకర్ ల ఎప్పటి నుంచో అభిమాని. అలాగే గతంలో పవన్ కళ్యాణ్ కెరియర్ లో అతి పెద్ద హిట్ సినిమాలలో ఒకటైన గబ్బర్ సింగ్ కి దర్శకత్వం వహించింది హరీష్ శంకర్. పులి, తీన్ మార్, పంజా వంటి మూడు వరుస డిజాస్టర్ ల తర్వాత పవన్ కళ్యాణ్ అందుకున్న మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ఆ సినిమా. అందుకే పవన్ కళ్యాణ్ కి  ఇష్టమైన వ్యక్తులలో హరీష్ శంకర్ కూడా ఒకరు. 

67

మరోవైపు హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమాని. తాజాగా ఇప్పుడు మళ్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా కూడా విడుదల కి సిద్ధం అవుతుంది.   ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

77

ఇప్పటికే ‘రాధే శ్యామ్’ ఫ్లాప్ కావడం, అటు ‘జన గణ మన’ ఆగిపోవడంతో ఐరెన్ లెగ్ అనే ప్రచారం జరిగింది. దీంతో మేకర్సే బుట్టబొమ్మను పక్కకు పెట్టారని చర్చ జరుగుతోంది. మరోవైపు డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల తప్పుకుందనే కోణమూ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. 
 

Read more Photos on
click me!

Recommended Stories