టాలీవుడ్ స్టార్స్ ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ బూతులు ఇవే.. చిరు, మహేష్, ఎన్టీఆర్ ఎక్కడెక్కడంటే 

By tirumala ANFirst Published May 12, 2024, 10:34 PM IST
Highlights

టాలీవుడ్ సినీ తారలంతా వారి వారి ఏరియాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఎవరెవరు ఎక్కడ ఏ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకుంటారో అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. 

సోమవారం రోజు అన్ని రాజకీయ పార్టీలకు బిగ్ డే అనే చెప్పాలి. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సోమవారం రోజు జరగబోతోంది. మరికొన్ని గంటల్లోనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక తెలంగాణాలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక్కడ కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

టాలీవుడ్ సినీ తారలంతా వారి వారి ఏరియాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఎవరెవరు ఎక్కడ ఏ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకుంటారో అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. 

Latest Videos

ఓబుల్‌రెడ్డి స్కూల్‌ లో జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ జూబ్లీహిల్స్ లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్‌ కుటుంబ సభ్యులంతా ఓటు వేయనున్నారు. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ లో మహేశ్‌బాబు, నమ్రత తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అదే చోట మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌, విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ ,శ్రీకాంత్‌ , జీవిత రాజశేఖర్ కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 

జూబ్లీహిల్స్‌ క్లబ్‌ లో చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన , నితిన్‌ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. షేక్ పేట్  ఇంటర్నేషనల్ స్కూల్ రాజమౌళి, రామారాజమౌళి తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో అక్కినేని ఫ్యామిలీ నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, అమల ఓటు హక్కు వినియోగించుకుంటారు. 

click me!