అసలే వరుస ఫ్లాపులు.. బేబమ్మని ఇలా టార్గెట్ చేశారు ఏంటి ?

First Published Aug 19, 2022, 4:05 PM IST

డెబ్యూ చిత్రమే ఘనవిజయం సాధించే అదృష్టం కొంతమంది హీరోయిన్లకు మాత్రమే దక్కుతుంది. అలాంటి అదృష్టం కృతి శెట్టికి దక్కింది.

డెబ్యూ చిత్రమే ఘనవిజయం సాధించే అదృష్టం కొంతమంది హీరోయిన్లకు మాత్రమే దక్కుతుంది. అలాంటి అదృష్టం కృతి శెట్టికి దక్కింది. ఉప్పెన చిత్రంతో కృతి శెట్టి టాలీవుడ్ కి పరిచయం అయిన సంగతి తెలిసిందే.  ఈ యంగ్ బ్యూటీ క్యూట్ లుక్స్ కి యువత ఫిదా అయ్యారు. 

ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. వరుసగా కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది. వీటిలో బంగార్రాజు మాత్రమే విజయం సాధించింది. మిగిలిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. రీసెంట్ గా విడుదలైన నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. 

krithi shetty


దీనితో కృతి శెట్టిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ షురూ అయింది. జయాపజయాలు ఎవరి చేతిలో ఉండవు. కానీ ఎంచుకునే కథలు స్ట్రాంగ్ గా ఉండాలి అంటూ కృతి శెట్టిని విమర్శిస్తున్నారు. ఆమెపై ఐరెన్ లెగ్ ముద్ర వేస్తున్నారు. కృతి శెట్టి ప్రస్తుతం సుధీర్ బాబు సరసన ' ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', అనే చిత్రంలో.. సూర్య సరసన మరో చిత్రంలో నటిస్తోంది. 

ఈ రెండు చిత్రాలు కృతి శెట్టి కెరీర్ కి చాలా కీలకం. ఆమె ఎంచుకుంటున్న కథల విషయంలో ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన విమర్శలు ఎదురవుతున్నాయి. ఉప్పెన తర్వాత వచ్చిన ప్రతి చిత్రాన్ని స్టోరీ వినకుండా ఓకే చేసేసినట్లు ఉంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు బేబమ్మ.. ఇక సినిమాలు చేసింది చాలు వెళ్లి చదువుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ది వారియర్, మాచర్ల నియోజకవర్గం రెండు చిత్రాలు రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్స్. ఈ రెండు చిత్రాల్లో కృతి శెట్టికి పెద్దగా ప్రాధాన్యత లేదు. కేవలం రొమాంటిక్ ట్రాక్, సాంగ్స్ కి మాత్రమే పరిమితం చేశారు. ఇలాంటి స్టోరీలు ఎంచుకుంటే పరాజయాలే ఎదురవుతాయి అని విమర్శిస్తున్నారు. 

ఉప్పెన హోరులో వరుస ఆఫర్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఆ చిత్రాల రిజల్ట్ తెలిసిపోయింది. దీనితో ఆమె స్పీడుకి బ్రేకులు పడ్డట్లే అని అంటున్నారు. ఇక నుంచి కృతి శెట్టి ఆచి తూచి అడుగులు వేస్తూ కథలు ఎంచుకోవాలి. లేకుంటే కెరీర్ మొదటికే మోసం రావచ్చు. 

click me!