భారత్ని మళ్లీ చూస్తానో లేదో భయంగా ఉంది.. హీరోయిన్ శ్రియ ఆందోళన
First Published Apr 14, 2020, 3:44 PM ISTప్రస్తుతం స్పెయిన్లో ఉన్న శ్రియ తన భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. స్పెయిన్ లో ఇంత ప్రభావం లేని సమయంలోనే శ్రియ భర్త ఆండ్రీ కొశ్చీవ్కు కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే పరిస్థితి ఆందోళన కరంగా లేకపోవటంతో కేవలం హోం క్వారెంటైన్లో ఉండాలని సూచించి వారిని ఇంటికి పంపేశారు డాక్టర్లు. తరువాత ఆండ్రీ ఆరోగ్య కుదుట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.