క్రికెటర్లు అందరూ కుక్కల్లా ఒకేలా మొరుగుతున్నారేంటి... రోహిత్ శర్మ ట్వీట్‌పై కంగనా రనౌట్ కామెంట్...

First Published Feb 4, 2021, 4:28 PM IST

మనమంతా కలిసికట్టుగా ఉంటే ఇండియా ఎప్పుడూ దృఢమైనదే... అంటూ రోహిత్ శర్మ ట్వీట్...

ఎందుకని ఈ క్రికెటర్లు అందరూ ధోబి కుక్కలా ఒకేలా మొరుగుతున్నారు...

 ఇక్కడ రచ్చ చేస్తున్న వారంతా టెర్రరిస్టులు... అది చెప్పడానికి క్రికెటర్లకి ఇంత భయమా...

సంచలన ట్వీట్ చేసి, కొద్దిసేపటికి డిలీట్ చేసిన కంగనా రనౌట్..

సినిమాలు, షూటింగ్‌ల కంటే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేసే వారికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చేందుకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తోంది బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.
undefined
అమెరికన్ పాప్ సింగర్ రిహానాను ‘పోర్న్ సింగర్’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్... తాజాగా క్రికెటర్లపై కూడా తన ప్రతాపాన్ని చూపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
undefined
రిహానా ట్వీట్ తర్వాత సచిన్ టెండూల్కర్‌తో పాటు విరాట్ కోహ్లీ, రహానే, రోహిత్ శర్మ వంటి క్రికెటర్లు... రైతులు దేశానికి ఎంతో అవసరమని, ప్రభుత్వం త్వరలోనే ఓ మంచి పరిష్కారం తీసుకుంటుందని చెబుతూ ఒకేలా ట్వీట్లు వేసిన సంగతి తెలిసిందే.
undefined
రోహిత్ శర్మ... ‘మనమంతా కలిసికట్టుగా ఉంటే ఇండియా ఎప్పుడూ దృఢమైనదే. సరైన పరిష్కారం వచ్చేవరకూ వేచి చూద్దాం. మనదేశాన్ని సమృద్ధిగా చేయడంలో రైతుల పాత్ర ఎంతో కీలకం. ప్రతి ఒక్కరూ తమ పాత్రను సక్రమంగా నిర్వహించి, ఈ సమస్యకు ఓ పరిష్కారం కనుక్కొంటారని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశాడు.
undefined
దీనికి స్పందించిన కంగనా రనౌట్... ‘ఎందుకని ఈ క్రికెటర్లు అందరూ ధోబి కుక్కలా ఒకేలా మొరుగుతున్నారు. వీరికి ఓ ఇల్లు, ఓ ఘాట్ లేనట్టు ఉంది.
undefined
రైతుల సంక్షేమం కోసం ఓ విప్లవంలా తయారుచేసిన చట్టానికి రైతులు ఎందుకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తారు. ఇక్కడ రచ్చ చేస్తున్న వారంతా టెర్రరిస్టులు... అది చెప్పడానికి ఇంత భయపడతారెందుకు’ అంటూ ట్వీట్ చేసింది కంగనా.
undefined
కంగనా ట్వీట్‌పై రోహిత్ శర్మ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ వేయకపోతే కుక్కలంటూ అవమానిస్తారా? అంటూ ట్రోల్ చేయడం మొదలెట్టారు...
undefined
తన ట్వీట్‌కి బీజేపీ సపోర్టుల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో కొద్దిసేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసింది కంగనా రనౌట్..
undefined
click me!