నాథూ సింగ్: ఐపిఎల్లో ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన నాథూ సింగ్ తండ్రి రాజస్థాన్లోని వైర్ ఫ్యాక్టరీలో కార్మికుడు. సంపాదన అంతంతే. ఇంటినిండా కష్టాలే. 2016 లో తన మొదటి IPL సీజన్లో, అతడిని ముంబై ఇండియన్స్ రూ. 3.2 కోట్లకు కొన్నది. కానీ ఆ సీజన్ లో పెద్దగా రాణించలేదు. దీంతో తర్వాత సీజన్లో గుజరాత్ లయన్స్ అతడిని రూ .50 లక్షలకు దక్కించుకోగా.. గత సీజన్ లో ఢిల్లీ అతడిని రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది.