ఆదాయపన్ను రిటర్ను దాఖలుకు గుడ్ న్యూస్.. రెండు నెలల అదనపు సమయం ప్రకటించిన సీబీడీటీ

First Published May 21, 2021, 1:00 PM IST

2020-21 సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయవలసిన తేదీని ప్రభుత్వం ఈ రోజు   రెండు నెలల పాటు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. అదే విధంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) కంపెనీలకు ఐటిఆర్ ఫైలింగ్ గడువును నవంబర్ 30 వరకు పొడిగించింది. 

కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని సీబీడీటీ ఈ నిర్ణయాలు తీసుకుంది.ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఖాతాలను ఆడిట్ చేయవలసిన అవసరం లేని ఇంకా సాధారణంగా ఐటిఆర్ -1 లేదా ఐటిఆర్ -4 ఉపయోగించి ఆదాయపు పన్ను రిటర్నును దాఖలు చేసే వ్యక్తులు ఐటిఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31ను. ఖాతాలకు ఆడిటింగ్‌ అవసరమైన వ్యక్తులు, కంపెనీలకు రిటర్నుల దాఖలు గడువు అక్టోబర్‌ 31.
undefined
ఉద్యోగులకు యజమానులు ఫారం 16 జారీ చేసే గడువును జూలై 15 వరకు పొడిగించినట్లు సిబిడిటి తెలిపింది. "ఆదాయపు పన్ను విభాగం కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్ http:incometax.gov.inను 7 జూన్ 2021న ప్రారంభించనుంది. ఆదాయపు పన్ను శాఖ నుండి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం, ప్రస్తుత ఐటిడి పోర్టల్ http:incometaxindiaefiling.gov.in పన్ను చెల్లింపుదారులకు ఇతర స్టేక్ హోల్డర్లకు 1 జూన్ 2021 నుండి 6 జూన్ 2021 వరకు అంటే 6 రోజుల పాటు అందుబాటులో ఉండదు .
undefined
పన్ను ఆడిట్ రిపోర్ట్, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ధృవీకరణ పత్రాన్ని దాఖలు చేయడానికి గడువు తేదీని నవంబర్ 30 వరకు పొడిగించారు. ఆలస్యమైన లేదా సవరించిన ఆదాయ రిటర్న్ దాఖలు చేయడానికి, గడువు తేదీ ఇప్పుడు 31 జనవరి 2022.అంతేకాకుండా ఆర్థిక సంస్థల స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ (ఎస్ఎఫ్‌టి) రిపోర్ట్ 31 మే 2021 నుండి 30 జూన్ 2021 వరకు పొడిగించారు.
undefined
"వివిధ గడువు తేదీల సడలింపులు ప్రస్తుత సంక్షోభంలో ఇబ్బందులు పడుతున్న వ్యాపారాలకు భారాన్ని తగ్గిస్తాయి. వ్యాపారాలు పన్ను సమ్మతిని పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మారడం ఎంత క్లిష్టమైనదో కూడా నొక్కి చెబుతుంది. వివిధ కాంప్లియన్సెస్ కోసం గడువు తేదీల పొడిగింపు ప్రస్తుత పరిస్థితులలో పన్ను చెల్లింపుదారులకు పన్ను దాఖలు చేయవలసిన తేదీ ముఖ్యమైనది, ఎందుకంటే భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా వ్యాపిస్తుంది "అని క్లియర్‌టాక్స్ వ్యవస్థాపకుడు, సి‌ఈ‌ఓ ఆర్కిత్ గుప్తా అన్నారు.
undefined
2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటి రిటర్నులను దాఖలు చేయడానికి సిబిడిటి ఏప్రిల్ 1న నోటిఫికేషన్లు ఇచ్చింది. కోవిడ్ మహమ్మారి కారణంగా కొనసాగుతున్న సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, పన్ను చెల్లింపుదారులకు సౌకర్యాలు కల్పించడానికి గత సంవత్సరం ఐటిఆర్ తో పోల్చితే పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లింపుదారులకు ఐ-టి చట్టంలోని సెక్షన్ 115 బిఎసి కింద కొత్త పన్ను పాలనను ఎన్నుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది.
undefined
దీని కింద రూ.2.5 లక్షల వరకు వార్షిక ఆదాయాన్ని పొందుతున్న వారికి పన్ను నుండి మినహాయించారు. అలాగే రూ.2.5 లక్షల నుండి రూ.5 లక్షల మధ్య సంపాదించే వ్యక్తులు 5 శాతం పన్ను చెల్లించాలి. రూ.5 నుంచి 7.5 లక్షల మధ్య ఆదాయానికి 10 శాతం పన్ను విధించగా, రూ.7.5 నుంచి 10 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి 15 శాతం పన్ను విధించబడుతుంది.రూ.10 నుండి 12.5 లక్షల మధ్య సంపాదించే వారు 20 శాతం చొప్పున పన్ను చెల్లించగా, రూ.12.5 నుండి రూ.15 లక్షల మధ్య ఉన్నవారు 25 శాతం చొప్పున చెల్లించాలి. రూ.15 లక్షలకు పైబడిన ఆదాయానికి 30 శాతం పన్ను విధించబడుతుంది.
undefined
undefined
click me!