చంద్రబాబుకు వలసల తలబొప్పి: అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్

First Published Jul 8, 2020, 2:33 PM IST

అధికారంలో ఉన్న సమయంలోనే కాదు అధికారానికి దూరంగా ఉన్న సమయంలో కూడ టీడీపీ అనేక సంక్షోభాలను చవిచూసింది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడ పలువురు నేతలు ఆ పార్టీని వీడారు. 

: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీని ఇరుకున పెట్టేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే వైసీపీ గూటికి చేరారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడ ఇదే బాటలో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అధికారానికి దూరంగా ఉన్న సమయంలో టీడీపీ నుండి అనేక మంది నేతలు పార్టీకి దూరమయ్యారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనూ ఇప్పుడు కూడ అదే రకమైన పరిస్థితులు నెలకొన్నాయి.
undefined
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2004 ఎన్నికల్లో టీడీపీ అధికారానికి దూరమైంది. ఆ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి టీఆర్ఎస్, ఉభయ కమ్యూనిష్టు పార్టీలు కలిసి పోటీ చేశాయి. టీడీపీ, బీజేపీలు కలిసి పోటీ చేశాయి.
undefined
అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 185 సీట్లు, టీడీపీకి 47, టీఆర్ఎస్ కు 26, సీపీఎంకు 9, సీపీఐకి 9 సీట్లు దక్కాయి. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు.
undefined
ఈ కాలంలో చంద్రబాబునాయుడు పార్టీని కాపాడుకొనేందుకు మీ కోసం పేరుతో రాష్ట్రంలో బస్సు యాత్ర నిర్వహించారు. ఈ కాలంలో టీడీపీలో ఉన్న ఫ్యాక్టన్ నేతలుగా ముద్ర పడిన వారు రాజకీయాలకు దూరమయ్యారు. పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు.ఈ కాలంలోనే టీడీపీకి చెందిన కీలక నేత పరిటాల రవి హత్యకు గురయ్యాడు.
undefined
ఇక 2009లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ రెండోసారి అధికారానికి దూరమైంది. టీడీపీతో టీఆర్ఎస్, ఉభయ కమ్యూనిష్టు పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో టీడీపీకి 92 సీట్లు, కాంగ్రెస్ కు 156 సీట్లు, ప్రజా రాజ్యం పార్టీకి 18 సీట్లు, టీఆర్ఎస్ కు 10 సీట్లు , సీపీఐకి 4, సీపీఎంకు 1 సీటు దక్కింది.
undefined
2009 నుండి 2014 ఎన్నికలు వచ్చే నాటికి టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 92 నుండి 74 కు తగ్గిపోయింది. ఆంధ్రప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు వైసీపీలో, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు.
undefined
తెలంగాణలో తెలంగాణ ఉద్యమం, ఆంధ్రప్రాంతంలో వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభంజనంతో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఆయా పార్టీల్లో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు కూడ టీడీపీని వీడారు.
undefined
2014 ఎన్నికలకు ముందు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకొంది. ఈ ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని కైవసం చేసుకొంది. అధికారంలో ఉన్న సమయంలో వైసీపీకి చెందిన 23 మందిని టీడీపీలో చేర్చుకొంది టీడీపీ. వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల్లో కొందరికి మంత్రి పదవులను కూడ టీడీపీ కట్టబెట్టింది.
undefined
2019లో జరిగిన ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలతోనే సరిపెట్టుకొంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్ బై చెప్పారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిలు వైసీపీకి మద్దతు ప్రకటించారు. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు వెంకటేష్ వైసీపీ తీర్ధం పుచ్చుకొన్నారు. కరణం బలరాం మాత్రం వైసీపీ కండువా కప్పుకోలేదు. కానీ జగన్ కు మద్దతు ప్రకటించారు.
undefined
టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీకి గుడ్ బై చెప్పారు. పోతుల సునీత, శివనాథ్ రెడ్డి, శమంతకమణిలు వైసీపీలో చేరారు. మరికొందరు నేతలు కూడ వైసీపీ లేదా బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. అధికారాన్ని కోల్పోయిన సమయంలో పార్టీ నుండి నేతలు దూరం కావడం మామూలేనని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.
undefined
click me!