హాట్ టాపిక్ :త్రివిక్రమ్ అప్పుడే మొదలెట్టేసాడేంటి..?

By AN TeluguFirst Published Sep 28, 2019, 3:29 PM IST
Highlights

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠపురములో చిత్రం రూపొందుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను జరుపుకుంది. కానీ రిలీజ్ సంక్రాంతికి. అంటే మరో నాలుగు నెలలు ఉంది. కానీ  తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ గా ఒక సాంగ్ ను వదిలారు.
 

సాధారణంగా సినిమా ఓ నెల ఉందనగా ప్రమోషన్స్ మొదలెడుతూంటారు. బాహుబలి లాంటి భారీ చిత్రాలు మినహాయిస్తే మిగతావన్నీ ఇదే స్కూల్ ఫాలో అవుతూంటాయి. ఎందుకంటే ప్రమోషన్స్  రిలీజ్ చాలా రోజులు ఉందనగా మొదలెడితే..రిలీజ్ డేట్ వచ్చేసరికి చల్లారిపోతాయి. బోర్ కొట్టేస్తాయి అని దర్శక,నిర్మాతలు భావిస్తూంటారు. ఈ మధ్యన సైరా కూడా అదే స్కూల్ లో వెళ్లింది. మెగా ఫ్యాన్స్ ఎంత కంగారుపడినా రిలీజ్ దగ్గర పడ్డాకే ప్రమోషన్స్ పరుగు ప్రారంభించింది. దాంతో రిలీజ్ రోజు దాకా ఈ సినిమా హీట్ పెరుగుతూనే ఉంటుంది.  అయితే త్రివిక్రమ్ మాత్రం ఎందకునో ఈ దారిలో ప్రయాణం పెట్టుకోక అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠపురములో చిత్రం రూపొందుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను జరుపుకుంది. కానీ రిలీజ్ సంక్రాంతికి. అంటే మరో నాలుగు నెలలు ఉంది. కానీ  తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ గా ఒక సాంగ్ ను వదిలారు.

సామజవరగమన .. నిను చూసి ఆగగలనా .. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా అంటూ ఈ పాట సాగుతోంది. నాయకుడు .. నాయకి వెంటపడుతూ, ఆమె పట్ల తనకి గల ప్రేమను వ్యక్తం చేసే సందర్భంలో వచ్చే పాటగా ఇది అనిపిస్తోంది. ఈ పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారింది. సొగసైన అర్థాలు వచ్చే పదునైన పద ప్రయోగాలు చేస్తూ ఆయన పాటను అందించారు. తమన్ బాణీ .. సిద్ శ్రీరామ్ ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి.

టబు కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతిని విడుదల చేయనున్నారు. ఇంకా నాలుగు నెలలు ఉండగా అప్పుడే ఈ ప్రమోషన్స్ ని ప్రారంభించటం చాలా చిత్రంగా చెప్పుకుంటున్నారు. అన్నీ ప్రమోషన్ ఆయుధాలు ఇప్పుడే వదిలేస్తే ..రిలీజ్ నాటికి ఏమి మిగిలుతాయి అని సందేహం వ్యక్తం చేస్తున్నారు సినీ విశ్లేషకులు. కానీ త్రివిక్రమ్ మాస్టర్ మైండ్ లో ఏముందో ఎవరికి తెలుసు కనుక.  

 

click me!