ఆదివారం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని చిత్రయూనిట్ వెల్లడించారు. ఈ ప్రకటనతో పాటు దర్శకుడి పేరును కూడా కన్ఫమ్ చేశారు. పూర్తి వివరాలు రేపు వెల్లడించనున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ వార్త వచ్చేసింది. సరిలేరు నీకెవ్వరు తరువాత నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఊరిస్తున్న మహేష్ ఫైనల్ క్లారిటీ ఇచ్చేశాడు. ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే గీత గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వంలోనే సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. రేపు (మే 31) సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నాడు.
ఈ మేరకు ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేశారు. రేపు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని వెల్లడించారు. ఈ ప్రకటనతో పాటు దర్శకుడి పేరును కూడా కన్ఫమ్ చేశారు. పూర్తి వివరాలు రేపు వెల్లడించనున్నారు. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీ లుక్ చేస్తే మరోసారి మహేష్ సందేశాత్మక చిత్రమే చేస్తున్నాడని అర్ధమవుతోంది. వరుసగా భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాలు చేసిన మహేష్ నెక్ట్స్ సినిమాల్లో అదే ఫార్ములా కంటిన్యూ చేయనున్నాడు.
We're back together with our Superstar 😍 Official Announcement 🥁
You've been hearing a lot about it, countdown begins to see the REAL thing 😊
31st May - 9.09 AM 🌠 pic.twitter.com/oRwDHQxUVw