గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ శోభా శెట్టి... కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్!

By Sambi ReddyFirst Published May 5, 2024, 1:53 PM IST
Highlights

బిగ్ బోస్ ఫేమ్ శోభా శెట్టి గుడ్ న్యూస్ చెప్పింది. ఆమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ మేరకు ఆసక్తికర సమాచారం అందుతుంది. 
 


శోభా శెట్టి తాజాగా ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. గతంలో ఇలానే జనవరి నెలలో శోభా వాళ్ళిద్దరికీ సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. ఇరు కుటుంబాల సమక్షంలో ఇరువురు దండలు మార్చుకున్న ఫోటోలు  ఆ మధ్య వైరల్ అయ్యాయి. అది నిశ్చితార్థం కాదట తాంబూలం మార్చుకున్నారట. అసలైన ఎంగేజ్మెంట్  ఇప్పుడు జరిగింది అంటూ శోభా తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో తన నిశ్చితార్థపు విశేషాలు పంచుకుంది. 

శోభా శెట్టి ఇటీవల తన సొంత ఇంట్లోకి అడుగు పెట్టింది. ప్రియుడు యశ్వంత్ రెడ్డి తో కలిసి గ్రాండ్ గా గృహప్రవేశం చేసింది. ఇప్పుడు మరో  గుడ్ న్యూస్ చెప్పి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసింది.  బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన తోటి నటుడు యశ్వంత్ రెడ్డి  ని ప్రేమిస్తున్నట్లు చెప్పి షాకిచ్చింది. అతన్ని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది. హౌస్ నుంచి వచ్చాక చక చక పెళ్లి పనులు మొదలెట్టింది. ప్రియుడుతో కలిసి కొత్త ప్రయాణం స్టార్ట్ చేసింది. 

ఇక తాజాగా వీరి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తుంది.  తన అతి ముఖ్యమైన రోజు కోసం ఇలా రెడీ అయ్యాను అంటూ శోభా వీడియో షేర్ చేసింది. పట్టు చీరలో .. ఒంటినిండా ఆభరణాలు వేసుకుని సంప్రదాయంగా రెడీ అయింది. చేతులకు మెహందీ పెట్టుకుని అందంగా కనిపిస్తుంది. ఈ వేడుకలో శోభా - యశ్వంత్ లు చాలా చూడముచ్చటగా కనిపించారు. ఎంగేజ్మెంట్ కి వచ్చిన వాళ్ళని చిరునవ్వుతో పలకరిస్తూ సందడి చేశారు. 

కార్తీకదీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు శోభా దగ్గరైంది. బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొని మరింత క్రేజ్ రాబట్టింది. 14 వారాలు బిగ్ బాస్ హౌస్ లో  రాణించింది. ప్రస్తుతం శోభా సీరియల్స్ లో నటించడం లేదు. యాంకర్ గా మారి  ఓ టాక్ షో చేస్తుంది. అలాగే కొత్త కొత్త బిజినెస్ లు స్టార్ట్ చేస్తుంది. యాక్టింగ్ కి బ్రేక్ తీసుకుని  పర్సనల్ లైఫ్ కి శోభా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో యశ్వంత్ తో కలిసి పెళ్లిపీటలెక్కనుంది శోభా శెట్టి.  

click me!