ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి, కానీ ఆ డైరక్టరే మూడో మీటింగ్ లోనే రేప్ చేసారు

By Surya PrakashFirst Published Mar 18, 2023, 5:02 PM IST
Highlights

  ఈ ముద్దుగుమ్మ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ బాలీవుడ్ డైరెక్టర్ కలిసిన మూడో మీటింగ్‌లోనే తనను రేప్ చేశాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.


 బాలీవుడ్‌ చిత్ర నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌ తనపై లైంగిక దాడి చేశారంటూ నటి పాయల్‌ ఘోష్‌ గతంలో ఆరోపించిన సంగతి తెలిసందే. తనకు న్యాయం చేయాలంటూ ప్రధాని మోదీని కోరారు. శనివారం ఆమె ట్విట్టర్‌లో..‘అనురాగ్‌ కశ్యప్‌ నాపై చాలా తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు. నరేంద్ర మోదీజీ.. ఈ విషయంలో చర్య తీసుకోండి. కశ్యప్‌లోని రాక్షస కోణాన్ని ప్రజలకు చూపెట్టండి. ఇలా వెల్లడించడం నాకు హాని చేస్తుందని, నా భద్రతకు ముప్పు అని నాకు తెలుసు. సాయం చేయండి’ అని కోరారు. ఇప్పుడు ఆమె మరో సారి అలాంటి ఆరోపణలే చేసింది. 

I worked in south film industry with 2 national award winning directors &star directors but nobody even touched me inappropriately but in Bollywood I haven’t even worked with Anurag Kashyap,bt he raped me on our third meeting, now say why I shouldn’t brag about south…!!!

— Payal Ghoshॐ (@iampayalghosh)

తెలుగులో ప్రయాణం, ఊసరవెల్లి లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ  పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. అంతేకాకుండా ఎన్‌టీఆర్‌కు మద్దతుగా మాట్లాడుతూ అతడితో వర్క్ ఎక్స్‌పీరియన్స్ మర్చిపోలేనని పలు సందర్భాల్లో తెలిపింది. అయితే సౌత్ సినిమాలపై సానుకూలంగా మాట్లాడటంతో కొంతమంది ఆమెను ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. తాజాగా వీటిపై స్పందించిన ఈ ముద్దుగుమ్మ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ బాలీవుడ్ డైరెక్టర్ కలిసిన మూడో మీటింగ్‌లోనే తనను రేప్ చేశాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.

నేను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్లలో, అగ్ర దర్శకులతో పనిచేశాను. కానీ ఎవరూ నాపై అనుచితంగా ప్రవర్తించలేదు. కానీ బాలీవుడ్‌లో డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌తో పనిచేయకుండానే అతడు మూడో మీటింగ్‌లోనే నన్ను రేప్ చేశాడు. అలాంటప్పుడు నేను సౌత్ ఇండస్ట్రీ గురించి ఎందుకు గొప్పగా చెప్పకూడదు. అంటూ పాయల్ ఘోష్ ప్రశ్నించింది.

అంతటితో ఆగకుండా జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో పనిచేశానని, ఆయన కూడా ఎప్పుడూ తనపై మిస్ బిహేవ్ చేయలేదని చెప్పుకొచ్చింది. "నేను సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా పనిచేశాను. ఆయన కూడా నాపై ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు. అంత గొప్పమనిషి అతడు. అందుకే నాకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం." అని పాయల్ ఘోష్ తెలిపింది.

అయితే పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలపై గతంలోనేఅనురాగ్ కశ్యప్   స్పందించారు. ఆమె వాఖ్యలపై స్పందించ వద్దని తన సన్నిహితులు చాలా మంది చెప్పారు.అయినా వాటిపై తన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ముందుకొచ్చా అన్నారు. పాయల్ వాఖ్యలపై అనురాగ్  స్పందిస్తూ మీరు నాపై నిరాధారమైన ఆరోపణలు చేశారని చెప్పడానికి స్పందించాల్సి వస్తుంది.భవిష్యత్తులో వాస్తవం ఏంటి అనేది అందరికి తెలుస్తుంది.

మీరు ఓ మహిళ అయి ఉండి కూడా నాతో కొంతమంది నటీమణులకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.ఇది మీకు తప్పుగా అనిపించడంలేదా? నన్ను ఇబ్బందుల పాల్జేసే క్రమంలో మీరు బచ్చన్ ఫ్యామిలీ సహా మరికొందరు ఇతర హీరోయిన్లను ఇందులోకి లాగే ప్రయత్నం చేశారు.ఓ దర్శకుడిగా ఎంతోమంది హీరోయిన్లతో మాట్లాడుతుంటాను.అలాగని వాళ్లతో ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదు.నేను రెండు వివాహాలు చేసుకోవడం తప్పని అంటే ఒప్పుకుంటాను కానీ ఇలాంటి ఆధారం లేని అబద్ధాలు చెబితే వాస్తవం అయిపోవు.ప్రతిదానికి కొన్ని హద్దులు ఉంటాయి. అంటూ అనురాగ్ తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. 
 

click me!