చికిత్స పొందుతున్న అభిమాని కోసం బాలయ్య ఏం చేశారో తెలుసా.. స్వయంగా వెళ్లి..

By telugu teamFirst Published Aug 29, 2021, 2:03 PM IST
Highlights

అభిమానుల విషయంలో బాలయ్య కాస్త కఠినంగా ఉంటారనే విమర్శ ఉంది. ఈ మేరకు గతంలో పలు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అభిమానుల విషయంలో బాలయ్య కాస్త కఠినంగా ఉంటారనే విమర్శ ఉంది. ఈ మేరకు గతంలో పలు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ అవసరమైనప్పుడు బాలయ్య తన అభిమానుల పట్ల మంచి మనసు కూడా చాటుకుంటున్నారు. 

తాజాగా బాలకృష్ణ తన అభిమాని కోసం చేసిన పని హృదయాలు గెలుచుకునే విధంగా ఉంది. బాలకృష్ణ అభిమాని ఒకరు అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ అభిమాని ఎవరో కాదు.. అఖిల భారత నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం కన్వీనర్ నంబూరి సతీష్ బాబు. 

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నంబూరి సతీష్ బాబు పుట్టిన రోజు నేడు. ఈ సంగతి తెలుసుకున్న బాలయ్య.. సతీష్ బాబుకు సర్ ప్రైజ్ ఇచ్చారు. స్వయంగా బాలయ్య సతీష్ బాబుని కలసి పరామర్శించారు. 

'మా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న… ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న నా అభిమాని, అఖిల భారత నందమూరి బాలకృష్ణ అభిమానుల కన్వీనర్ నంబూరి సతీష్ గారిని సందర్శించాను. ఆయన త్వరగా కోలుకోవాలని దేవునికి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీ నందమూరి బాలకృష్ణ' అని బాలయ్య సోషల్ మీడియాలో పోస్ట్ పోస్ట్ పెట్టారు. 

తన తల్లి నందమూరి బసవతారకం జ్ఞాపకార్థం బాలయ్య బసవతారకం ఆసుపత్రిని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆసుపత్రిలో క్యాన్సర్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. 

సినిమాల విషయానికి వస్తే బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించబోతున్నారు. 

click me!