బూతులు తిడుతున్నారంటూ..సైబర్‌ క్రైమ్‌కి మోహన్‌బాబు ఫిర్యాదు

By Aithagoni RajuFirst Published Jul 10, 2021, 11:51 AM IST
Highlights

 సోషల్‌ మీడియా వేదికగా యూట్యూబ్‌లో కొందరు మోహన్‌బాబుని టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన తరఫు లీగల్‌ అడ్వైజర్‌ సంజయ్‌ శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మోహన్‌బాబు ఓ ఛానెల్‌ పై కేసు పెట్టారు. తనని విమర్శిస్తుందంటూ ఓ యూట్యూబ్‌ ఛానెల్‌పై ఆయన ఫిర్యాదు చేశారు.  సోషల్‌ మీడియా వేదికగా యూట్యూబ్‌లో కొందరు మోహన్‌బాబుని టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన తరఫు లీగల్‌ అడ్వైజర్‌ సంజయ్‌ శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు యూట్యూట్‌ ఛానెల్‌లో మోహన్‌బాబుని వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా, బూతులు తిడుతూ వీడియోలు అప్‌లోడ్‌ చేశారంటూ ఆయన ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మోహన్‌బాబు లీగల్‌ అడ్వైజర్‌ సంజయ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మోహన్‌బాబు `సన్నాఫ్‌ ఇండియా` చిత్రంలో నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన లీడ్‌ రోల్‌ చేస్తున్న చిత్రమిది. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆయన విరూపాక్ష పాత్రలో నటిస్తున్నారు. దీంతోపాటు సమంత మెయిన్‌ లీడ్‌ చేస్తున్న `శాకుంతలం`లో కీలక పాత్ర పోషిస్తున్నారు మోహన్‌బాబు. 

click me!