మాస్ మహారాజాతో ‘అధర్వ’ టీమ్.. చిత్ర టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ విడుదల చేసిన రవితేజ..

By team teluguFirst Published Aug 29, 2022, 6:07 PM IST
Highlights

తెలుగులో రూపుదిద్దుకున్న బహుభాషా చిత్రం ‘అధర్వ’ టీమ్ తాజాగా మాస్ మహారాజా రవితేజను కలిశారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా చిత్ర టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ ను విడుదల చేయించారు. పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
 

యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం ‘అధర్వ’(Atharva). ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ ను టచ్ చేస్తూ రాబోతున్న సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.  నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన  టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. 

ఈ నేపథ్యంలో మాస్ మహారాజాను చిత్ర యూనిట్ కలిసింది. రవితేజ చేతులు మీదుగా చిత్రం తెలుగు టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ ను విడుదల చేయించారు. ‘నేను నమ్మిన సత్యం, వెతికే లక్ష్యం, దొరకాల్సిన సాక్ష్యం చేధించే వరకు ఈ కేసును వదిలిపెట్టను సార్’ అంటూ హీరో చెబుతున్న డైలాగ్స్ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా రవితేజ చిత్ర యూనిట్ ను అభినందించారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ అట్రాక్షన్ గా నిలిచింది. అతి చిన్న వీడియోతోనే సినిమాపై ఆసక్తి పెంచేశారు మేకర్స్. టైటిల్ బోల్డ్ నలుపు అక్షరాలతో ఉండగా, మధ్య పదం మాత్రం DNA రేఖాచిత్రంతో ఎరుపు రంగులో పెయింట్ చేయబడటం సినిమాలోని వైవిధ్యాన్ని బయటపెడుతోంది.

ఈ చిత్రాన్ని ‘ది సీకర్ ఆఫ్ ది ట్రూత్’ అనే ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పోల్చితే ఇది పూర్తిగా డిఫరెంట్ అనుభూతిని కలిగిస్తుందని మేకర్స్ హామీనిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే మోషన్ పోస్టర్ ఉంది. అదేవిధంగా డీజే టిల్లు, మేజర్ లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు బాణీలు కట్టడం విశేషం.  

మూవీకి చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్రంలో సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా రూపొందిస్తుండగా..  విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు.  

click me!