'మహర్షి' సినిమాతో రిస్క్ లో పడతారా..?

By Udayavani DhuliFirst Published Nov 21, 2018, 4:36 PM IST
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమా ఓవర్సీస్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ ని సాధించి అతడి కెరీర్ లో మంచి హిట్ గా నిలిచింది. దాదాపు 3.5 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. అయినప్పటికీ సినిమాను కొన్న బయ్యర్లకు మాత్రం లాభాలు ఆశించిన స్థాయిలో రాలేదు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమా ఓవర్సీస్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ ని సాధించి అతడి కెరీర్ లో మంచి హిట్ గా నిలిచింది. దాదాపు 3.5 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. అయినప్పటికీ సినిమాను కొన్న బయ్యర్లకు మాత్రం లాభాలు ఆశించిన స్థాయిలో రాలేదు. 

దానికి కారణమేమిటంటే.. సినిమాను భారీ ధరలకు ఓవర్సీస్ లో అమ్మారు. దీంతో బయ్యర్లు స్వల్ప లాభాలతో బయటపడ్డారు. ఇప్పుడు మహేష్ బాబు 'మహర్షి' విషయంలో కూడా ఇలానే జరగబోతుందట. వంశీ పైడిపల్లి దర్శకత్వం మహేష్ నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు భారీ ధరకి అమ్మాలని చూస్తోన్న నిర్మాతలు ఇప్పుడు ఓవర్సీస్ లో కూడా తగ్గడం లేదని తెలుస్తోంది.

అక్కడి బయ్యర్లు రూ.16 కోట్లు పెట్టి హక్కులు దక్కించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నిర్మాతలు ఆ నెంబర్ ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఒకరకంగా రిస్క్ అనే చెప్పాలి. ఆ రేంజ్ లో లాభాలు అందుకోవాలంటే సినిమా సాలిడ్ హిట్ అందుకోవాలి లేదంటే బయ్యర్లు నష్టాల్లో పడడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. 

'భరత్ అనే నేను'కి హిట్ టాక్ వస్తేనే అది సరైన లాభాలను తీసుకురాలేకపోయింది. అంటే 'మహర్షి' సినిమా అంతకు మించి సక్సెస్ అవ్వాలన్నమాట. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ స్టామినాకి ఈ సినిమా పెద్ద పరీక్షనే చెప్పాలి!

ఇవి కూడా చదవండి.. 

మహేష్ సినిమాలో బాలయ్య హీరోయిన్!

మహేష్ ‘మహర్షి’ కథ ఇదేనా?

మహేష్ బాబు ఐదు గెటప్పుల్లో..!

'మహర్షి' షూటింగ్ లో హాట్ బ్యూటీ మిస్!

టాక్ ఆఫ్ ది టౌన్: అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్షిప్... సీక్రెట్ ఇదే

మహేష్.. దిల్ రాజు మాట వినడం లేదా..?

మహర్షి: మహేష్ లుక్ మాములుగా లేదు.. చంపేసాడు!

తప్పులో కాలేసిన హీరో మహేష్ బాబు

మహర్షి శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఛానెల్!

మహేష్ నిజంగానే మోసం చేస్తున్నాడు?

 

click me!
Last Updated Nov 21, 2018, 4:37 PM IST
click me!