ఆ రికార్డ్ కృష్ణ-విజయనిర్మలకే సొంతం!

By AN TeluguFirst Published Jun 27, 2019, 12:01 PM IST
Highlights

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో, హీరోయిన్ కలిసి నటించిన సినిమా సక్సెస్ అయిందంటే చాలు.. దర్శకనిర్మాతలు ఆ కాంబినేషన్ తో సినిమా తీయడానికి ఆసక్తి చూపుతారు. 

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో, హీరోయిన్ కలిసి నటించిన సినిమా సక్సెస్ అయిందంటే చాలు.. దర్శకనిర్మాతలు ఆ కాంబినేషన్ తో సినిమా తీయడానికి ఆసక్తి చూపుతారు. ఆడియన్స్ కూడా ఆ హిట్ పెయిర్ ని మళ్లీ తెరపై చూడాలని అనుకుంటారు.

అలా ఇప్పటివరకు చాలా మంది నాయకానాయికలు వెండితెరపై సందడి చేశారు. అలాంటి వారిలో  కృష్ణ-విజయనిర్మల జంట కూడా ఉంది. వీరిద్దరూ కలిసి నటించిన తొలిచిత్రం 'సాక్షి'.. బాపు డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది.

ఆ తరువాత వీరిద్దరూ కలిసి ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 47 చిత్రాల్లో నటించారు. ఇదొక రికార్డ్ అనే చెప్పాలి. ఇంతవరకు టాలీవుడ్ లో ఏ జంట కూడా కలిసి ఇన్ని సినిమాలు చేయలేదు.

వీటిల్లో 'టక్కరి దొంగ చక్కని చుక్క', 'మోసగాళ్లకు మోసగాడు', 'పండంటి కాపురం', 'దేవుడు చేసిన మనుషులు', 'మీనా', 'అల్లూరి సీతారామరాజు' ఇలా ఎన్నో విజయవంతమైన సినిమాలు ఉన్నాయి.   

ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

ఆ సినిమా కారణంగా కలిసిన కృష్ణ-విజయనిర్మల!

అప్పట్లో విజయనిర్మలవన్నీ మగవేషాలే..!

విజయనిర్మల మృతిపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

ఆమె మరణం పరిశ్రమకి తీరనిలోటు.. వైఎస్ జగన్!

విజయనిర్మల.. జయసుధకి ఏమవుతుందో తెలుసా..?

విజయనిర్మలగారిని ఎవరితోనూ పోల్చలేం: జీవితా రాజశేఖర్

ఆమె మరణవార్త కలచివేసింది.. ఎన్టీఆర్ కామెంట్స్!

click me!