తల్లైన ఆనందంలో అనుష్క శర్మ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ద్వారా తల్లి కావడం ఎంతో గొప్ప అనుభూతి అని చెప్పుకొచ్చారు. కాగా ఈ పోస్ట్ పై ఓ మహిళా జర్నలిస్ట్ సెటైర్ వేయగా, డైరెక్టర్ మారుతి జర్నలిస్ట్ కి కౌంటర్ ఇచ్చాడు.
టాలీవుడ్ దర్శకుడు మారుతీ ఓ జర్నలిస్ట్ పై ఫైర్ అయ్యారు. ఇంగ్లాండ్ రాణి కావడం కంటే తల్లి కావడమే ఓ ఆడదానికి గొప్పని చెప్పారు. విషయంలోకి వెళితే...క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ గర్భవతి అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కొద్దిరోజుల క్రితం విరాట్ మరియు అనుష్క సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీనితో కోట్లాదిగా ఉన్న వీరిద్దరి అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
కాగా నిన్న అనుష్క శర్మ మరో పోస్ట్ పంచుకున్నారు. తల్లి కావడం కంటే గొప్ప అనుభూతి ఏముంటుందని అర్థం వచ్చేలా ఓ పోస్ట్ ఇంస్టాగ్రామ్ లో పెట్టారు. ఈ పోస్టుపై మహిళా జర్నలిస్ట్ మీనా దాస్ నారాయణ్ వ్యంగ్యంగా స్పందించారు. 'విరాట్ మిమ్మల్ని తల్లిని మాత్రమే చేశారు, ఇంగ్లాండ్ మహారాణిని కాదు. కొంచెం గాల్లో తేలడం ఆపండి అని కామెంట్ పెట్టారు.
సదరు మహిళా జర్నలిస్ట్ కామెంట్ పై దర్శకుడు మారుతి ఫైర్ అయ్యారు. ఒక ఆడదానికి తల్లి కావడం కంటే ఏది ఎక్కువ కాదు, ఇంగ్లాండ్ మహారాణి కావడం కంటే తల్లి కావడమే ఓ ఆడదానికి సంతోషం ఇస్తుందని కౌంటర్ వేశాడు. మహిళ అందులోను జర్నలిస్ట్ అయ్యి ఉండి ఇలాంటి కామెంట్ పెట్టడం దారుణం అని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Disgraceful comments
That too frm a lady journalist :(
Motherhood is bigger joy than being queen of England
Yes every woman is a queen & every happy home is a kingdom
She's a normal human being too before being a celebrity & she has full right to be happy & flaunt her baby bump https://t.co/QnwX8Uzfy5